► 200 మంది పోలీసులపై హెల్మెట్ కేసులు
► సిఫార్సులు తెస్తే
► క్రమశిక్షణ చర్యలు
చెన్నై నలుమూలలా సుమారు 120 సెంటర్ల వద్ద కాపుకాసి మరీ ద్విచక్రవాహనదారులను పట్టుకుని కేసులు పెడుతున్నారు. చెన్నైలో సగటున రోజుకు మూడువేల కేసులు నమోదు అవుతున్నాయి. హెల్మెట్ కేసులపై రోజూవారి నివేదికలు ఇవ్వాలని చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, పోలీస్శాఖలోని కొందరు విధులకు వచ్చేటప్పుడు, విధుల నుంచి ఇంటికి వె వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు కమిషనర్కు ఫిర్యాదులు అందాయి.
దీంతో హెల్మెట్ ధరించని పోలీసు సిబ్బంది, పట్టుబడిన వారిని విడిపించాల్సిందిగా సిఫార్సులు చేసే అధికారులు, ఏ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ విభాగాన్ని ఆదేశించారు. ఎక్కువ శాతం మంది పోలీసులు హెల్మెట్ ధరించకుండా వెళుతున్నట్లు అదనపు నిఘాలో తేలింది. అలాగే కేసులు లేకుండా విడిపించాలని సైతం కొందరు అధికారులు సిఫార్సులు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. చట్టాని ధిక్కరించే వారు పోలీసులైనా సరే వదలవద్దని కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక హెల్మెట్ కేసుల నుంచి విముక్తికి సిఫార్సు చేసే పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.
కమిషనర్ జార్జ్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్రవాహనదారులపై నిఘా పెంచగా రెండు వారాల్లో 200 మంది పోలీసులు పట్టుబడ్డారు. ముఖ్యంగా దక్షిణ చెన్నైలో 50 మంది పోలీసులు దొరికారు. వీరందరిపైనా కేసులు బనాయించడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ విభాగ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ చెన్నైలో రెండు నెలల క్రితం 40 శాతం మంది ద్విచక్రవాహనదారులు మాత్రమే హెల్మెట్ ధరించేవారని చెప్పారు. తనిఖీలు పెరిగిపోవడంతో హెల్మెట్ ధరించే వారు 85 శాతానికి పెరిగారని, ఇది సంతోషించదగిన పరిణామమని తెలిపారు.
నెలరోజులుగా రోజుకు ఆరువేల హెల్మెట్ కేసులు నమోదవుతుండగా, హెల్మెట్ ధరించే వారి సంఖ్య పెరగడంతో కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతూ రోజుకు మూడు వేలకు చేరుకున్నాయని చెప్పారు. హెల్మెట్ వాడకంలో ఎవ్వరికీ మినహాయింపు లేదని, పోలీసు శాఖలో ఉంటూ హెల్మెట్ ధరించక పోవడాన్ని మరింత తీవ్రంగా పరిగణిస్తూ శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. కేసులు నమోదైన పోలీసులు ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
పోలీస్ అయితే ఏంటీ?
Published Fri, Nov 11 2016 3:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement