► ఉపాధ్యాయుల తీరుపై హైకోర్టు
► ప్రభుత్వ టీచర్లు విధులకే రారు
► ఇంకెక్కడ విద్యా ప్రమాణాలు
సాక్షి, చెన్నై: ప్రశ్నిస్తే తమకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తారా అంటూ ఉపాధ్యాయుల తీరుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కారని, అలాంటప్పుడు విద్యా ప్రమాణాల మెరుగు ఎలా సాధ్యం అవుతుందని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సహకారంతో సాగే, ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం తరగతులకు నాలుగేళ్ల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, తంజావూరు పందనల్లూరులోని ప్రభుత్వ సహకారంతో సాగే పాఠశాలలో ఇంగ్లిషు తరగతుల నిర్వాకం కోర్టుకు చేరింది. రెండు రోజుల క్రితం ఈ పిటిషన్ విచారణకు రాగా, న్యాయమూర్తి కృపాకరణ్ తీవ్రంగానే స్పందించారు. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని, ఉపాధ్యాయుల్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.
ఇంగ్లిషు తరగతుల గురించి, ఆంగ్ల బోధనలు, శిక్షణ పొందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల తీరు, తమిళం బోధించే ఉపాధ్యాయుల చేత ఆంగ్ల బోధన, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు. అర్హతలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం బోధనలో వెనకపడేందుకు గల కారణాలు ఇలా అనేక రకాల ప్రశ్నలు అడిగి ఆయన ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, కోర్టు తమను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఉపాధ్యాయ సంఘాల్లో ఆగ్రహం రేగింది. కోర్టు తీరును నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది. శుక్రవారం ఓ పిటిషన్ విచారణ సమయంలో కృపాకరణ్ తీవ్రంగానే స్పందించడం గమనార్హం.
ప్రశ్నిస్తే...ఆందోళన: కోర్టు ఏదేని ప్రశ్నించినా, అక్షింతలు వేసినా...ఆందోళనలకు దిగే వారు పుటుకొస్తున్నట్టుందని తీవ్రంగా మండిపడ్డారు. తమకే బెదిరింపులు ఇచ్చే రీతిలో ఆందోళనకు పిలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కారని, ఈ విషయంగా తనకు ఎన్నో ఫిర్యాదులు వచ్చినట్టు వివరించారు. 165 పనిదినాల్లో కేవలం 65 దినాలు మాత్రమే విధులకు వస్తున్నారని , జీతాలు మాత్రం బాగానే ఆర్జిస్తున్నారని, ఇలాంటి వారికి ఎలా తిన్నది జీర్ణం అవుతుందంటూ, అందుకే ఆందోళనలు సాగిస్తున్నట్టుందని విరుచుకుపడ్డారు.
కొన్ని చోట్ల ఒక విద్యార్థికి ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ఇద్దరు సిబ్బంది...పరిస్థితి ఇలా ఉంటే, ఎలా విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని ప్రశ్నించారు. ఇక, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పుడే సెల్ఫోన్లను ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ఇక, పిల్లలు ఎలా చదువుల మీద దృష్టి పెడతారని ప్రశ్నించారు. ఎనిమిదో తరగతి వరకు ఆల్పాస్ నినాదం ఉండడంతో, తొమ్మిదో తరగతిలోకి అడుగుపెట్టగానే విద్యార్థిబుర్రలో అన్ని సబ్జెక్టులను దూర్చాల్సింతగా విద్యా పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే...ఆందోళనలు అంటూ ముందుకు సాగితే, ఉపాధ్యాయుల్ని కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం.
ప్రశ్నిస్తే..ఆందోళనా?
Published Sat, Jul 8 2017 4:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement