చెన్నైలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు | Sakshi
Sakshi News home page

చెన్నైలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు

Published Fri, May 2 2014 1:46 PM

Hoax bomb threat calls keep chennai police on their toes

సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఉన్న రైల్లో బాంబు పేలి ఒక యువతి మరణించి 24 గంటలు గడిచిందో, లేదో.. చెన్నై పోలీసులకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఈ ఫోన్లు మాత్రం ఆగడంలేదు.

నగరంలోని ఓ పెద్ద షాపింగ్ మాల్, ఓ విద్యాసంస్థ, ఓ శివారు రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దీంతో వెంటనే భద్రతా విభాగం అధికారులు హుటాహుటిన వెళ్లి అక్కడ పూర్తిస్థాయిలో తనిఖీ చేసినా, బాంబులు మాత్రం దొరకలేదని నగర పోలీసు కమిషనర్ జేకే త్రిపాఠీ తెలిపారు.

Advertisement
Advertisement