సాక్షి, ముంబై: బీజేపీ వైఖరిపై స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, ఆర్పీఐ పార్టీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి మండలి విస్తరణ కోసం ఎదురు చూస్తున్న వీరికి బీజేపీ వైఖరితో ఆశలు సన్నగిల్లుతున్నాయి. నాలుగు విధాన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న మిత్రులకు బీజేపీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. విధానమండలికి ఎన్నికై ఆ తరువాత మంత్రి పదవికి ఎర వేయాలనుకున్న మిత్రుల ఆశలను బీజేపీ మొగ్గలోనే తుంచివేసింది.
మూడు స్థానాల్లో స్వయంగా పోటీ చేయాలని, మరో స్థానం శివసేనకు వదిలేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 2017 ప్రారంభంలో జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రామ్దాస్ ఆఠవలేకు చెందిన ఆర్పీఐకి ఓ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అందువల్ల మండలి స్థానాల్లో ఒకటి ఆర్పీఐకి కేటాయించనున్నట్టు సమాచారం.
ఇక శివసంగ్రామ్ పార్టీ నాయకుడు వినాయక్ మెటే ఇటీవలే బీజేపీ సభ్యత్వం తీసుకోవడంతో ఆయనకు కూడా మంత్రి పదవి లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకు గాను వినాయక్ మెటే బీజేపీ టికెట్పై శాసనమండలికి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడో స్థానంలో బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీని బరిలోకి దింపనున్నారని తెలిసింది. దీనిని బట్టి స్వాభిమానిషేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పార్టీలకు కేబినెట్లో చోటు లేనట్టేనని భావిస్తున్నారు. లోకసభతోపాటు శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత మిత్రపక్షాలకు బీజేపీ నుంచి సరైన ఆదరణ లభించడంలేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
శివసేనను వీడి తప్పుచేశాం..!
అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివసేనను వీడి తప్పుచేశామన్న భావనను ఆర్పీఐ నాయకుడు రామ్దాస్ ఆఠవలే వ్యక్తంచేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శివసేనతో ఉండి ఉంటే తమ పార్టీకి సరైన న్యాయం జరిగేదని పేర్కొన్నారు. శివసేనతో పొత్తుపెట్టుకుని ఉంటే ఆ పార్టీ స్థానాలు మరో 30 నుంచి 35 పెరిగేవి. దీంతో బీజేపీ ద్వితీయ స్థానంలో నిలిచేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రం, కేంద్రంలో ఆర్పీఐని బాగస్వామ్యం చేసుకుంటామని బీజేపీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మిత్రుల ఆశలపై నీళ్లు చల్లిన బీజేపీ
Published Sun, Jan 18 2015 5:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
What’s your opinion
Advertisement