ముంబై: దక్షిణాదిన అగ్రస్థానంలో తారగా కొనసాగుతున్న తరుణంలో బాలీవుడ్లోకి అడుగుపెట్టి తొలిప్రయత్నంలోనే పరాజయాన్ని చవిచూసినా తాను నిరాశ పడలేదని అంటోంది తమన్నా. తెలుగు, తమిళ చిత్రాలు చేతినిండా ఉన్నప్పుడే బాలీవుడ్లోకి అడుగుపెట్టి అజయ్ దేవ్గణ్తో ‘హిమ్మత్వాలా’ సినిమా చేసిన విషయం తెలిసిందే. 80వ దశకంలో శ్రీదేవి, జితేంద్ర నటించిన సినిమాను అదే పేరుతో దర్శకుడు సాజిత్ఖాన్ రీమేక్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ... ‘రీమేక్ చిత్రాలను బాలీవుడ్ అభిమానులు ఆదరిస్తున్నప్పటికీ 1980 నాటి చిత్రాలను రీమేక్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా కూడా అదే రీతిలో సాగడాన్ని ప్రేక్షకులు స్వాగతించలేకపోయారు.
‘హిమ్మత్వాలా’లో నటించడం ద్వారా ఓ పెద్ద అడుగు వేశానని భావించాను. సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినా నేను నిరాశపడలేదు. సినిమా ఎంపిక ఎలా ఉండాలనే విషయమై ఓ పాఠం నేర్చుకున్నాననిపించింది. ప్రతి నటుడికి, నటికి ఇలాంటి అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. కెరీర్లో ఎన్నో విజయాలు, అపజయాలు ఎదుర్కొన్నాను. దీనిని కూడా అదేవిధంగా భావించాన’ని చెప్పింది. మళ్లీ సాజిద్ఖాన్ దర్శకత్వంలోనే ‘హమ్షకల్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా జూన్ 20 విడుదల కానుంది. మళ్లీ సాజిద్తోనే ఎందుకు పనిచేస్తున్నారు? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... చేసిన దర్శకుడితోనే మళ్లీ సినిమా చేయడం తప్పేమీ కాదే... ఆయనతో పనిచేయడంలో నాకెలాంటి భయం, ఇబ్బందీ లేద’ని చెప్పింది. జీవితంలో ఎవరైనా ఎత్తుపల్లాలను ఎదుర్కొనక తప్పదని, ఈసారి మా ప్రయత్నం తప్పక సత్ఫలితాలనిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
నిరాశపడలేదు..!
Published Wed, Jun 4 2014 10:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
తప్పక చదవండి
Advertisement