సాక్షి, న్యూఢిల్లీ: జనక్పురిలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్టీ రామారావు మెమోరియల్ సీనియర్ సెకండరీ పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రకమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ అనిత విద్యార్థులందరికీ ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో వేడుకలు ఆరంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని భాషల వారు తమ మాతృభాషను చూసి గర్వించాలని, ఇతర భాషలను కించపరచరాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీవైష్ణవి తెలుగులో అనర్ఘళంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. 10 వ తరగతి విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, తెలుగు ఉపాధ్యాయులు పాడిన మా తెలుగుతల్లికి మల్లెపూదండపాటకు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.
పాఠశాలలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు తమ తమ మాతృభాషల్లో ప్రసంగించారు. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి తెలుగు ఉపాధ్యాయుడు టి. లక్ష్మీనారాయణ, హిందీ ఉపాధ్యాయిని రూపేశ్వరి, ఆంగ్ల ఉపాధ్యాయిని ప్రసన్న లక్ష్మి మూడు భాషల గొప్పదనాన్ని గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రెండోతరగతి విద్యార్థిని సాయినందిని చక్కని తెలుగు పాటపాడి వినిపించింది. తెలుగు భాషేతరులైన విద్యార్థులు తెలుగు పద్యాలు చదివి వినిపించారు. తెలుగు విద్యార్థులు తెలుగు భాష ప్రాశస్త్యాన్ని , తెలుగుపై మక్కువను తమ కవితల ద్వారా చాటారు. హిందీ మాతృభాషగా కలిగిన విద్యార్థులు తెలుగులో మాట్లాడడంద్వారా ఏ భాష నేర్చుకోవాలన్నా శ్రద్ధాసక్తులు ఉంటే సరిపోతుందనే విషయాన్ని నిరూపించారు.
ఏఈఎస్ జనక్పురి పాఠశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం
Published Sat, Feb 21 2015 11:04 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement