సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య మేళాకు నగరం సిద్ధమవుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ మేళా కోసం ప్రగతిమైదాన్లో ప్రత్యేకంగా పార్కింగ్, మెట్రో టోకెన్ కౌం టర్లు, భద్రత తదితర సన్నాహాలు చేస్తున్నారు. మేళాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. దేశ విదేశాలకు చెందిన ఆరు వేల మంది ఎగ్జిబిటర్లు మేళాలో పాల్గొననున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ తమ రంగాలలో సాధించిన ప్రగతిని ఇందులో ప్రదర్శిస్తాయి. భాగ స్వామ్య దేశ హోదాలో జపాన్, భాగస్వామ్య రాష్ట్ర హోదాలో బీహార్ ఈ మేళాలో పాల్గొం టున్నాయి.
దక్షిణాఫ్రికా వరుసగా ఫోకస్ కంట్రీ హోదాతో మేళాలో పాల్గొననుంది. మేళా మొదటి ఐదు రోజులు వాణిజ్య సందర్శకులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. నవంబర్ 19 నుంచి సామాన్యులకు కూడా మేళాలో ప్రవేశం ఉంటుంది. భాగస్వామ్య రాష్ట్రంగా మేళాలో కీలక స్థానాన్ని ఆక్రమించిన బీహార్ పెవిలియన్ ముందుభాగాన్ని సబో ర్ చారిత్రాత్మక వ్యవసాయ విశ్వవిద్యాలయం నమూనాలో తీర్చిదిద్దుతారు. బీహార్ వంటకాల రుచులను అందించేందుకు ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటుచేస్తున్నారు. నవంబర్ 22న బీహార్ డే గా పాటిస్తారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ సంవత్సరం మేళాలో పాల్గొనే విదేశీ ఎగ్జిబిటర్ల సంఖ్య తగ్గిందని మేళాను నిర్వహించే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) చైర్పర్సన్ రీటా మీనన్ తెలిపారు. ఈ ఏడాది 21 దేశాలకు చెందిన 260 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని ఆమె చెప్పారు. గత ఏడాది మేళాలో 427 మంది విదేశీ ఎగ్జిబిటర్లు పాల్గొన్నారని ఆమె వివరించారు.
యూఎస్, శ్రీలంక, బ ంగ్లాదేశ్ మేళాలో పాల్గొనడం లేదు, దేశీ ఎగ్జిబిటర్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎగ్జిబిషన్ కంపెనీలు, 30 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు వాటి ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సుమారు 5,700 స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నాయని ఆమె వివరించారు. గ్రామీణాభివద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసే కాపార్ట్ పెవిలియన్ దేశం నలుమూలల నుంచి వచ్చిన 800 గ్రామీణ వృత్తి నిపుణులకు వేదిక కానుంది. మేళా సందర్శనకు వచ్చే వారినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు పెద్దలకు రూ.50 , పిల్లలకు రూ. 30 వసూలు చేస్తారు. శని, ఆదివారాలు,సెలవు దినాల్లో మాత్రం పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.50 ప్రవేశరుసుముగా వసూలు చేయనున్నారు. ఉద యం 9.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మేళాలో ప్రవేశించవచ్చు.
‘ప్రగతి’ మైదాన్..
Published Sat, Nov 9 2013 12:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement