సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమర యోధుల మధ్య వివాదం సృష్టించడం సరికాదని గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ అన్నారు. వారి పేర్లను దుర్వినియోగం చేయడం తగదని హితవు పలికారు. ఇక్కడి బాల భవన్లో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూల మధ్య వివాదం సృష్టించేలా ప్రసంగాలు చేస్తున్నారని పరోక్షంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని విమర్శించారు. సర్దార్ పటేల్ దేశాన్ని సమైక్య పరచగా, నెహ్రూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారని ప్రశంసించారు.
కనుక వారిద్దరూ దేశానికి తమదైన కానుకలను ఇచ్చారని కొనియాడారు. కనుక వారికి తమదనే ఘనత ఉందని అన్నారు. అలాంటి వారి పేర్లను ఉపయోగించుకుని లాభం కోసం వివాదాన్ని సృష్టించడం తగదని పేర్కొన్నారు. కాగా బలమైన దేశ నిర్మాణంలో భావి తరాలైన పిల్లల పాత్ర మహత్తరమైనదని అన్నారు. పిల్లలకు జ్ఞాన సముపార్జనతో పాటు క్రమశిక్షణలో తర్ఫీదునివ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొడగు జిల్లాకు చెందిన రాఘవేంద్ర, బెంగళూరులోని బీటీఎం లేఔట్కు చెందిన అభిరామ్లకు శౌర్య, మండ్యకు చెందిన మోనికాకు కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఆ బిల్లు అవసరం లేదు
మూఢాచారాల నిరోధానికి ప్రభుత్వం తీసుకు రాదల్చిన ముసాయిదా బిల్లుపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి బిల్లు అవసరం లేదన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చెడుల గురించి ఆలోచించే శక్తి ఉందని, కనుక అలాంటి బిల్లు అనవసరమని తెలిపారు. తాము కోరుకున్న దాన్ని పొందే హక్కు ప్రజలకుందని, వద్దనుకునే దాన్ని తిరస్కరించే అధికారమూ ఉందని వివరించారు. కనుక బిల్లు విషయంలో ప్రభుత్వం మరో సారి ఆలోచించాలని ఆయన సూచించారు.
ఉక్కు మనిషి పేరు దుర్వినియోగం
Published Fri, Nov 15 2013 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement