అమరావతి: గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రూపొందిన జలవాణి కాల్సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికార నివాసంలో ప్రారంభించారు. జలవాణి ద్వారా 1800 425 1899 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించారు.
అధికార యంత్రాంగం, సంప్రదాయ మాధ్యమాలు, అధునాతన ఏ.ఎమ్.ఎస్ అలర్ట్ మేనేజ్మెంట్ను ఉపయోగించి అధునాతన కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్, ఆ శాఖ, గ్రామీణ నీటి సరఫరా పథకం అధికారులు పాల్గొన్నారు.