ఇద్దరు సస్పెన్షన్
18 మందికి వెయిటింగ్ లిస్టు
ఐపీఎస్లలో కూడా
సచివాలయంలో చర్చ
అసెంబ్లీకి తాకిన ఐఏఎస్ల ఆక్రోశం
సమాధానం కరువుతో వాకౌట్
చెన్నై: జయలలిత ప్రభుత్వ తీరుతో పలువురు ఐఏఎస్లలో ఆక్రోశం రగిలింది. ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు 18 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచడమే కాకుండా... మరి కొందరు సీనియర్లను ప్రాధాన్యత లేని చోట నియమించినట్లు సమాచారం అందడంతో సచివాలయంలో చర్చకు దారి తీసింది. అలాగే ఐపీఎస్ అధికారులు పలువురు ఐఏఎస్ల తరహాలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు సిద్ధం అవుతుండడంతో వ్యవహారం కాస్తా అసెంబ్లీకి చేరింది.
దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువు కావడంతో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొందరు ఐఏఎస్లను పక్కన పెట్టే పనిలో పడిందని సమాచారం. ఈ అధికారుల్లో ఎక్కువ శాతం మంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల యంత్రాంగం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించ బడ్డ వారే నని తెలిసింది. అయితే ఇదే సమస్యను పలువురు ఐపీఎస్ అధికారులు కూడా ఎదుర్కొంటున్నట్టు సమాచారం.
తాజాగా సచివాలయంలో ప్రభుత్వ కక్ష సాధింపునకు ఐఏఎస్లు, ఐపీఎస్లు గురి అవుతున్నట్టుగా చోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ఇటీవల ఆగమేఘాలపై బదిలీ వేటు పడిన జ్ఞానదేశికన్తోపాటు ప్రజా పనుల శాఖ కార్యదర్శి యతీంధ్రనాథన్ పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే 18 మంది అధికారులకు ఎలాంటి పదవులు లేకుండా వెయింటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మరి కొందరు సీనియర్లు ప్రాధాన్యత లేని చోట్ల తీసుకెళ్లి పడేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇది కాస్త ఐఏఎస్లలో ఆక్రోశాన్ని రగిల్చింది.
సుమారు 35 మంది ఐఏఎస్లు ఏకమై.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో భేటి అనంతరం ఓ నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్టు సచివాలయంలో చర్చ హోరెత్తుతున్నది. అదే విధంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఐపీఎస్ అధికారులు సైతం ఏకం అవుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐఎఎస్, ఐపీఎస్లో రగిలిన అసంతృప్తి జ్వాల ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అన్న ఉత్కంఠ బయలుదేరి ఉన్నది.
అదే సమయంలో ఈ వ్యవహారం గురువారం అసెంబ్లీని తాకింది. అసెంబ్లీలో ఈ విషయంగా సమాధానం రాబట్టేందుకు ప్రధాన ప్రతి పక్షం డిఎంకే, కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే, పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ ఐఏఎస్ల సస్పెండ్, పక్కన పెట్టే వ్యవహారాల వెనుక కారణాల గురించి ప్రశ్నిస్తే పాలకుల వద్ద సమాధానాలు లేదని మండి పడ్డారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని స్టాలిన్ చెప్పారు.
ఐఏఎస్ల ఆక్రోశం
Published Fri, Sep 2 2016 9:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement