జయ, కరుణల నామినేషన్కు అతనే కీలకం
సీఎం అభ్యర్థులకు సిసలైన ఏజెంట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటుంది. అవునంటే కాదు, ఆలి అంటే మొగుడు అని వాదించుకునే తత్వం. ఒకరి ప్రభుత్వంలో చేసిన పని మంచిదైనా మలి ప్రభుత్వం రాగానే దాన్ని కాలరాయాల్సిందే’. అయితే ఆశ్చర్యకరంగా వారిద్దరిని సీఎం పీఠం ఎక్కించే అవసరాలకు సహాయపడేది మాత్రం ఒక్కరే కావడం విశేషం. తమిళనాడు రాజకీయాల గురించి తెలిసిన వారు ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏమా కథ అనేంతగా జుట్టుపీక్కోరు. ఆ ఇద్దరు డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. వారిద్దరికీ ఒకే దిక్కుగా నిలిచిన చిరు జీవి స్టాంప్ పేపర్ల ఏజెంటు. ఇంతకూ విషయం ఏమిటంటే...
ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నామినేషన్ల విషయంలో కొన్ని పోలికలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఈనెల 25వ తేదీనే నామినేషన్ వేశారు. అలాగే ఇద్దరు గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గం (ఆర్కేనగర్, తిరువారూరు) నుంచి గెలుపొందారో అదే నియోజకవర్గం నుండి సిట్టింగ్ అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు. ఇలాంటి పోలికలతో తాజా ఎన్నికలు జరుగుతుండగా మరో విచిత్రమైన పోలిక కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే అభ్యర్థులు అనేక ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి తన ఆస్తి తదితర వివరాలను స్టాంప్ పేపర్లపై మాత్రమే పొందుపరిచి నామినేషన్ పత్రంతో జత చేయాలి.
మైలాపూరు పీబీవీ కోయిల్ వీధికి చెందిన రూప్బాషా (68) అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టాంప్ వెండర్ ఉన్నాడు. ఈ వ్యక్తి వద్దనే ఈనెల 23వ తేదీన జయలలిత కోసం స్టాంప్పేపర్లు కొనుగోలు చేశారు. అలాగే కరుణానిధి కోసం డీఎంకే నేతలు గత నెల 23వ తేదీన స్టాంప్ పేపర్ల కొన్నారు. ఈ సందర్బంగా రూప్బాషా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం అన్నాడీఎంకే నేతలు వచ్చి ముఖ్యమంత్రి నామినేషన్కు అవసరమైన స్టాంప్ పేపర్లు కావాలని కోర డంతో ఆనందంతో అప్పగించాను అన్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జయలలితకే తానే స్టాంప్ పేపర్లు ఇచ్చానని తెలిపారు. అంతేగాక కరుణానిధికి సైతం తానే స్టాంప్ పేపర్లు సిద్ధం చేశానని కొందరు చెప్పారు.
అయితే కరుణానిధి పేరుతో చెన్నైలో ఎంతో మంది ఉన్నందున పోల్చుకోలేక పోయా ను. స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు, బడా రాజకీయ నాయకులు తన వద్దకు వస్తుంటారు, వారిని ఎక్కువ ప్రశ్నలు వేయకూడదని చెప్పాడు. అం దుకే మీడియా వారు చెప్పేవరకు జయలలిత, కరుణానిధిలకు తానే స్టాంప్ పే పర్లు అమ్మానని తెలియదని అతను ఆనం దం వ్యక్తం చేశాడు. జయలలిత నివసించే పోయెస్గార్డెన్, కరుణానిధి నివాస గృహం ఉన్న గోపాలపురం రెండునూ మైలాపూరు డివిజన్ నోటరీ కిందకే వస్తుంది. ఈ కారణం వల్ల జయ, కరుణ ఇద్దరూ తప్పని సరిగా అదే స్టాంప్ పేపర్ల ఏజెంటు వద్ద కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇదండీ అసలు సంగతి.
ఆ ఇద్దరికి ఒక్కరే దిక్కు
Published Fri, Apr 29 2016 12:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement