సాక్షి, చెన్నై : రాజధాని నగరం చెన్నై నుంచి నిత్యం దక్షిణాది జిల్లాలకు, పక్క రాష్ట్రాలు ఆంధ్రా, కర్ణాటకలకు పెద్ద ఎత్తున జనం రాకపోకలు సాగిస్తుంటారు. కోయంబేడు నుంచి ప్రభుత్వ బస్సులు ఓ వైపు, పక్కనే ఉన్న ఆమ్నీ బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు మరో వైపు ఉరకలు తీస్తూ ఉంటాయి. వీటిల్లో చార్జీలు ఆయా బస్సుల స్థాయికి, వసతులకు తగ్గట్టుగానే ఉంటారుు. దక్షిణాదిలోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, దిండుగల్, తిరునల్వేలి, కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలకు ప్రతి రోజూ రైలు సేవలు సాగుతున్నాయి. చార్జీల వడ్డన : రైళ్ల సేవల మీద ఆధారపడిన పేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన చార్జీలను వడ్డించారు. దీంతో వారు గగ్గో లు పెడుతున్నారు. యూపీఏ బాటలోనే ఎన్డీఏ కూడా పయనిస్తున్నట్టు విమర్శిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల్ని దృష్టి లో ఉంచుకుని చార్జీలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాది జిల్లాలకు వెళ్లే అత్యధిక రైళ్లల్లో స్లీపర్ క్లాస్లను ఉపయోగించే వాళ్లే ఉన్నారని, ఇప్పుడు చార్జీలు పెంచడం భారంగానే ఉంటుందని ఓ ప్రయాణికుడు వాపోయాడు.
నేతల వ్యతిరేకత : చార్జీల వడ్డనను అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి.చార్జీల పెంపును ఉప సంహరించుకోవాలంటూ సీఎం జయలలిత, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి చార్జీల పెంపును విమర్శించారు. అధికారంలోకి వచ్చీ రాగానే, ప్రజల నడ్డి విరిచే భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధినేత రాందాసులు చార్జీల పెంపును వ్యతిరేకించారు. పునః పరిశీలన చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, కేంద్ర మాజీ మంత్రి జికే వాసన్లు తమప్రకటనలో కేంద్రం తీరును తప్పుబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్, ఎస్ఎంకే నేత శరత్కుమార్, వీసీకే నేత తిరుమావళవన్ తమ ప్రకటనల్లో యూపీఏ బాటలోనే ఎన్డీఏ పయనిస్తున్నదన్న విషయం ఈ వడ్డనతో స్పష్టం అవుతోందని విమర్శించారు.
ఈఎంయూ చార్జీలు : చెన్నైలో లక్షలాది మందికి ప్రయాణమార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళ్ల చార్జీలు పెరగనున్నాయి. బీచ్ - తాంబరం - చెంగల్పట్టు, బీచ్ - సెంట్రల్ - తిరువళ్లూరు- అరక్కోణం- తిరుత్తణి, సెంట్రల్ - గుమ్మిడి పూండి - సూళూరు పేట మార్గాల్లో నిత్యం ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇవీ చార్జీలు : పెరిగిన చార్జీలతో ఇది వరకు చెన్నై నుంచి దక్షిణాది జిల్లా గుండా వెళ్లే రైళ్లలో ఉన్న చార్జీల కంటే అధికంగా రూ.40 మేరకు పెరిగాయి. స్లీపర్ క్లాసులో ఈ మేరకు పెరిగిన పక్షంలో, ఇక ఫస్ట్ , సెకండ్, థర్డ్ ఏసీల్లో సరాసరిగా దూరాన్ని బట్టి వంద నుంచి రూ.మూడు వందలకు వరకు పెరగనున్నాయి. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లల్లో స్లీపర్ క్లాస్ చార్జీల వివరాలు పై పట్టికలో పేర్కొన్న విధంగా వసూలు చేయనున్నారు.
టికెట్టు రెట్టింపు
Published Sat, Jun 21 2014 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement