ముఖ్యమంత్రి ఆగ్రహం
.
బెంగళూరు : తమిళనాడులో జయలలిత అధికారంలో ఉన్నప్పుడల్లా కావేరి జలాల పంపిణీ జఠిలంగా మారుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతి చిన్న విషయానికి ఆమె కయ్యానికి కాలు దువ్వుతూ జగడాలమారిగా తయారయ్యారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయనిక్కడ కన్నడ సాహిత్య పరిషత్ శతాబ్ది ఉత్సవాల భవన నిర్మాణానికి శంకు స్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. కావేరి నిర్వహణా మండలి అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ, జయలలిత పదే పదే అర్జీలు సమర్పించి ఎదురు దెబ్బలు తింటున్నారని విమర్శించారు. జయతో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పోటీ పడుతూ ప్రధానికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. జయలలిత రాజకీయ లబ్ధి కోసం కావేరి వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మినహా తమిళనాడుకు నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగానే నీటిని వదులుతున్నామని చెప్పారు. కేఆర్. సాగర్ కర్ణాటకలో ఉన్నందున, ఈ రాష్ట్ర రైతులకు ఎక్కువ ప్రయోజనాలు కలగాలని అన్నారు. అయితే జలాశయం నుంచి ఎక్కువ నీరు తమిళనాడు పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ సవరణే మార్గం
ప్రాథమిక విద్యా బోధన మాతృ భాషలోనే సాగడానికి రాజ్యాంగ సవరణ మాత్రమే ఏకైక మార్గమని సీఎం అన్నారు. భాషా మాధ్యమంపై ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు వల్ల మాతృ భాష ఉనికికి ప్రమాదం ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై సానుకూల ఆదేశాలు రాకపోతే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం కేవలం కన్నడంపైనే కాకుండా, అన్ని ప్రాంతీయ భాషలపై ఉంటుందని చెప్పారు. అంగ్లాన్ని ఓ భాషగా ఎవరూ వ్యతిరేకించడం లేదని, ఎల్కేజీ నుంచి దానిని నేర్చుకున్నప్పటికీ, స్థానిక భాషలను విస్మరించరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఉమాశ్రీ, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.
జగడాలమారి జయ
Published Wed, Jun 18 2014 3:27 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement