చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆరోపించారు. జయకు మద్దతు తెలుపుతూ, 131 మంది ఎమ్మెల్యేలు శనివారం నిరాహారదీక్ష చేపట్టారు. అమ్మ ఫొటోతో కూడిన భారీ బ్యానర్ను ఉంచి చెన్నై బీచ్రోడ్డులోని ఎంజీ రామచంద్రన్ సమాధి వద్ద దీక్ష ప్రారంభించారు. ఎమ్మెల్యే తిరుచ్చీ మనోహరన్ నాయకత్వంలో నల్ల చొక్కాలను ధరించి వచ్చిన ఎమ్మెల్యేలతో ఉదయం 8 గంటలకు దీక్ష మొదలైంది. దీక్ష చేపట్టిన ప్రదేశం, జయలలిత తన ఇంటి నుంచి నిత్యం సచివాలయూనికి వెళ్లే మార్గం కావడంతో జయ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు.
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ప్రతిపక్షానికి చెందిన నేతలు అమ్మపై లేనిపోని ఆరోపణలను గుప్పించి కేసులుపై కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ప్రత్యక్షంగా పేర్లను ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేతలపై విమర్శలు కురిపించారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్ల కార్డులను ప్రదర్శించారు. జయను వెంటనే విడుదల చేయాలంటూ ప్రతి ఎమ్మెల్యే అమ్మ ఫొటోతో కూడిన ప్లకార్డును చేతపట్టుకుని సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించారు. దీక్షలో 119 మంది అన్నాడీఎంకే, 8 మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు, నలుగురు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు పెరంబూరులో మానవహారం నిర్మించారు. సుమారు వెయ్యిమంది కార్యకర్తలు పెరంబూరు ఫ్లైవోవర్ నుంచి కొలత్తూరు రెట్టేరీ వరకు సుమారు గంటపాటు జయ జయ ధ్వానాలు చేస్తూ మానవహారంగా నిలిచారు.
గత నెల 27న జయ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే శ్రేణులు, వారి మద్దతు దారులు, వివిధ కార్మిక సంఘాలు, న్యాయవాదులు ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. ఈనెల 7న అమ్మ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుండగా, బెయిల్ మంజూరు కాగలదని విశ్వసిస్తున్నారు. బెయిల్పై అమ్మ బయటకు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. జయకు జైలు శిక్ష పడటాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొందరు, బలవన్మరణాలకు పాల్పడి మరి కొందరు ప్రాణాలు విడిచారు. అమ్మకోసం శనివారం వరకు 62 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు.
అమ్మపై కుట్ర
Published Sun, Oct 5 2014 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement