24న జయ కేసు విచారణ | Sakshi
Sakshi News home page

24న జయ కేసు విచారణ

Published Sun, Jul 19 2015 2:32 AM

24న జయ కేసు విచారణ - Sakshi

టీనగర్: సుప్రీంకోర్టులో జయలలిత కేసు ఈనెల 24వ తేదీన విచారణకు రానుంది. ఆస్తులు కూడబెట్టిన కేసులో ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ అనే నలుగురిని బెంగళూరు హైకోర్టు న్యాయమూర్తి కుమారసామి విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ క ర్ణాటక ప్రభుత్వం తరపున జూన్ 23వ తేదీ సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలైంది. అందులో పేర్కొన్న లోపాలను సరిదిద్దుతూ ఈ నెల 11వ తేదీ మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. ఇదేవిధంగా డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ తరపున కూడా సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలైంది. ఇలావుండగా అప్పీలు పిటిషన్‌పై విచారణ ఈనెల 24వ తేదీ ప్రారంభం కానున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement