- తమిళనాట 28 మంది మంత్రులుగా ప్రమాణం
- కేబినెట్ కూర్పుపై విమర్శలతో మరో నలుగురికి అవకాశం
- ఎన్నికల హామీ నెరవేరుస్తూ ఐదు పథకాలపై సంతకం
- స్టాలిన్ను వెనుక కూర్చోబెట్టడంపై కరుణ ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు వర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ రోశయ్య ఆమెతో ప్రమాణం చేయించారు. 28 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం జరగలేదన్న విమర్శలతో మరో నలుగురికి కేబినెట్లో జయ అవకాశమిచ్చారు. ఆమె సిఫార్సు మేరకు గవర్నర్ నలుగురు మంత్రుల్ని కేబినెట్లోకి తీసుకున్నారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. వీరు మంగళవారం మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
కాగా, జయ ప్రమాణం అనంతరం గత కేబినెట్లో పనిచేసిన 15 మందితో పాటు కొత్తగా 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పొన్ రాధాకృష్ణన్, లోక్సభ ఉప సభాపతి ఎం.తంబిదురై, జయ సన్నిహితురాలు శశికళలు ముందు వరుసలో కూర్చున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలోపన్నీర్సెల్వం(ఆర్థిక), సి.విజయభాస్కర్(వైద్యం) తదితరులు ఉన్నారు. ఏడాది కాలంలో జయ రెండు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మే 23, 2015న జయ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదు పథకాలపై తొలిసంతకం.. ప్రమాణం పూర్తికాగానే ఆడిటోరియం నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లిన జయ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రైతు రుణాల రద్దు, పెళ్లి కుమార్తెకు తాళికోసం 8 గ్రాముల బంగారం, చేనేత రంగానికి అదనంగా విద్యుత్, వంద యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకాలపై సంతకం చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. 500 మద్యం షాపుల మూసివేతతో పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు షాపులు తెరవొద్దని ఆదేశాలిచ్చారు.
కావాలనే అవమానించారు: కరుణానిధి
జయ ప్రమాణ కార్యక్రమంలో తన కుమారుడు స్టాలిన్ను వెనుక వరుసలో కూర్చోపెట్టడంపై డీఎంకే చీఫ్ కరుణానిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే మద్దతుతో పోటీ చేసి ఓడిన శరత్ కుమార్ను ముందువరుసలో కూర్చోపెట్టి స్టాలిన్ను జనం మధ్య కూచో బెట్టడమేమిటన్నారు. జయను ప్రధాని మో దీ ట్విటర్లో అభినందించారు. ఆమె ప్రభుత్వం తో కేంద్రం కలసి పనిచేస్తుందని చెప్పారు.
సీఎంగా జయ ప్రమాణం
Published Tue, May 24 2016 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement