అన్నాడీఎంకేలో ఎదురుతెన్నులు
సీఎం చాంబర్కు సింగారం
వేలాది మంది
తలనీలాల సమర్పణ
అమ్మ నిర్దోషిగా బయటపడాలన్న ఆశ నెరవేరింది, సీఎంగా చూడాలన్న కోర్కె తీరేనా, ఏడు నెలల ఎదురుచూపుల కలలు నెరవేరేనా అనే బెంగ అన్నాడీఎంకేలో అలుముకుంది. అన్నాడీఎంకే నుంచి గురువారం సైతం ఆశాజనకమైన సమాచారం వెలువడకపోవడంతో విచారంలో మునిగిపోయారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వెలువడిన తాజా తీర్పు అన్నాడీఎంకేలో ఆనందాన్ని కలుగజేసినా, అమ్మ అధికార పగ్గాలు చేపట్టేందుకు అడ్డంకులు ఎదురుకావడం హతాశులను చేసింది. తీర్పు వెలువడి నాలుగురోజులైనా పార్టీ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు. ముఖ్యమంత్రిగా జయ ప్రమాణస్వీకార ముహూర్తం ఎప్పుడో చూచాయగా కూడా తెలియరాలేదు. శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా నగరంలోనే ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశించిన పార్టీ వారందరినీ నియోజకవర్గాలకు వెళ్లిపొమ్మని చెప్పింది.
ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, 20 మంది మంత్రులు బుధవారం రాత్రి జయను కలుసుకునే ప్రయత్నం ఫలించలేదు. ఈనెల 22 లేదా 23 వ తేదీన అమ్మ ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఈ విషయంపై 17వ తేదీన నిర్ణయం తీసుకుంటారని అనధికార వార్త. ఇదిలా ఉండగా, టీఎన్సీసీ అధ్యక్షులు ఇళంగోవన్, పీఎంకే అగ్రనేత రాందాస్ తదితరులు అప్పీలుపై గళం పెంచగా, జయ సీఎం కావడం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని కేంద్ర మంత్రి పొన్రాధాకృష్ణన్ ప్రకటించారు.
ఒక వైపు అప్పీలు...మరోవైపు సింగారాలు ః
తాజా తీర్పుపై అప్పీలు చిక్కుముడులు వీడిన తరువాతనే ముఖ్యమంత్రి పీఠం గురించి ఆలోచించాలని భావిస్తున్నట్లు అమ్మ నుండి పరోక్షంగా సంకేతాలు అందాయి. తీర్పు, అప్పీలు అంశాలపై అమ్మ తనకు సన్నిహితులైన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అప్పీలు అంశంలో కర్నాటక వైఖరి సుప్రీం కోర్టు దిశగా అడుగులు వేస్తున్నట్లు అంచనావేస్తున్నారు. జయ సీఎం కావడంలో ఇంతటి చిక్కుముడులు పడిఉన్న తరుణంలో ప్రభుత్వం మాత్రం జయ కోసం సీఎం చాంబర్ను సిద్ధం చేస్తోంది. గత ఏడు నెలలుగా మూతవేసి ఉన్న సీఎం చాంబర్కు రంగులు వేసి మెరుగులు దిద్దుతున్నారు. చాంబర్లోని ఆమె టేబుల్పై అమర్చిన ఖరీదైన గ్రానైట్ రాయికి దోషం ఉందని, కలిసిరాలేదని కొందరు సూచించడంతో రాయిని మారుస్తున్నారు. సచివాలయంలో అమ్మ కోసం ప్రత్యేకంగా అమర్చిన లిఫ్ట్కు మరమ్మత్తులు, ప్రవేశం ద్వారం వద్ద సున్నాలు కొట్టిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అమ్మ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ముహూర్తం ఎప్పుడో?
Published Fri, May 15 2015 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
‘శబరి’ మూవీ రివ్యూ
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement