బెంగళూరు: అవినీతిని నిరోధించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏసీబీని రద్దు చేసే వరకు పోరాటం ఆగబోదని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ స్పష్టం చేశారు. ఏసీబీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ విషయంపై జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్కు లేఖ రాశారని అయితే వారు ఈ అంశంపై స్పందించలేదన్నారు. అందువల్ల తాము పోరాటానికి సన్నద్ధమయ్యామని అన్నారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి గవర్నర్ వజుభాయ్ వాలాను కలిసి ఏసీబీ రద్దుపై వినతి పత్రాన్ని అందజేశారు.