సాక్షి, చెన్నై : రెండు నెలల వేతనం కోసం జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో చెన్నై రాజీవ్ గాంధీ ఆస్పత్రి(జీహెచ్) వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చెన్నై జీహెచ్లో వందలాది మంది జూనియర్ డాక్టర్లు రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి రోజూ షిఫ్టు పద్ధతిలో వీరు విధులను నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే, రెండు నెలలుగా వీరికి జీతం మంజూరు కాలేదు. హాస్టళ్లలో సౌకర్యాలు శూన్యం కావడంతో ఆందోళనకు జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. శనివారం ఉదయాన్నే విధులకు హాజరైన జూనియర్ డాక్టర్లు అందరూ ఆందోళనబాట పట్టారు. వైద్య సేవలను పక్కన పెట్టి, ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. రెండు నెలలుగా బకాయి ఉన్న జీతాన్ని మంజూ రు చేయాలని, వార్డెన్ను మార్చాలని, హాస్టల్లో సౌకర్యా లు, వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
గంట పాటుగా వైద్య సేవలకు ఆటంకం నెలకొనడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జూనియర్ డాక్టర్లను బుజ్జగించే యత్నం చేశారు. పక్క రాష్ట్రాల్లో యూజీ వైద్యులకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలు ఇస్తున్నారని ఆందోళనకారులు పేర్కొన్నారు. అయితే, తమకు కేవలం రూ.14,400 జీతం ఇస్తున్నారని, దీన్ని కూడా రెండు నెలలు బకాయి పెట్టడం ఎంత వరకు సమంజసమని అధికారులను నిలదీశారు. హాస్టల్లో వార్డెన్ తీరును ఎత్తి చూపుతూ, ఆయన్ను మార్చాలని, తమకు మెరుగైన వసతులు కల్పిం చాలని ఒత్తిడి తెచ్చారు. చివరకు అధికారులు కొన్ని హామీ లు ఇచ్చి ఆందోళన విరమింప చేశారు. పది రోజుల్లో బకా యి వేతనం మంజూరు, హాస్టల్లో సౌకర్యాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీతం పెంపు విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖతో చర్చించినానంతరం నిర్ణయం తీసుకోవా లని దాట వేశారు. ఈ ఆందోళన పుణ్యమా అంటూ గంట పాటుగా రోగులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
జీతం కోసం జూడాల ఆందోళన
Published Sat, May 10 2014 11:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement