మంత్రులపై సీఎం అసహనం
* మీ పని తీరుపై అధిష్టానానికి నివేదిక ఇచ్చా
* ఇకనైనా పని తీరు మార్చుకోండి
*లేకుంటే.. జరగబోయే పరిణామాలకు నేను బాధ్యుడ్ని కాను
* నా మాటలను పెడచెవిన పెడుతున్నారు
* ఎమ్మెల్యేల ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు చేస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు స్పందించారు. బెల్గాంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో ఆయన మంత్రుల ఎదుటే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పని తీరును మార్చుకోక పోతే మున్ముందు చోటు చేసుకునే పరిణామాలకు తనను బాధ్యుని చేయవద్దని కోరారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మీ పని తీరుపై నివేదిక సమర్పించానన్నారు. మారండి, మారండంటూ ఎంతగా మొత్తుకున్నా వినిపించుకోడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
బెంగళూరులో ఉన్నప్పుడు వారంలో కనీసం మూడు రోజులు విధాన సౌధకు వచ్చి, అధికారులతో చర్చించాలన్న తన సూచనలను సైతం పెడచెవిన పెట్టారని నిష్టూరమాడారు. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తల సమస్యలపై స్పందించడం లేదు, కేపీసీసీ కార్యాలయానికీ వెళ్లడం లేదు అంటూ ఆయన మంత్రుల వైఫల్యాల చిట్టాను విప్పారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినప్పుడు మంత్రులు స్పందించడం లేదని, దీనిపై ఫిర్యాదులు వచ్చినా తీరు మారడం లేదని నిష్టూరమాడారు.
ఇదే వైఖరి కొనసాగితే మున్ముందు ఏమవుతుందో తాను చెప్పలేనని హెచ్చరించారు. అంతకు ముందు పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరును తప్పుబట్టారు. తమను విశ్వాసంలోకి తీసుకుని నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులపై స్పందించాలని కోరారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని సూచించారు. కనీసం రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశాలను నిర్వహించి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
మారకపోతే.. మీ ఖర్మ
Published Thu, Dec 5 2013 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement