ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రం విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు తాజా సమాచారం. విషయం ఏమిటంటే కడల్ వంటి ఫ్లాప్ చిత్రం తరువాత ఈ దర్శకుడికి మలి చిత్రం చేయడానికి ఎంత ఆలస్యమైందో ఓకే కణ్మణి వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత అంత జాప్యం జరుగుతుండడం గమనార్హం. ఓకే కణ్మణి విజయోత్సాహంతో మణిరత్నం వెంటనే మల్టీస్టారర్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కించాలని తలచారు.
అందులో టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేశ్బాబు, ఐశ్వర్యారాయ్ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి ప్రయత్నాలు చేశారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం నుంచి ఆ స్టార్స్ తప్పుకున్నారు. దీంతో మణిరత్నం మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారు.నాగార్జున, మహేశ్బాబుల పాత్రలో కార్తీ, మలయాళ యువనటుడు దుల్కర్సల్మాన్, నిత్యామీనన్, కీర్తీసురేష్లను ఎంపిక చేశారు. ఆ కాంబినేషన్ సెట్ అయిపోయిందనుకునేంతలోనే దుల్కర్సల్మాన్, కార్తీసురేష్ అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలిగారు.
ఆ తరువాత దుల్కర్సల్మాన్ను రీప్లేస్ చేయడానికి టాలీవుడ్ నటుడు నానీ సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. ఒక సమయంలో అసలు ఈ ప్రాజెక్టే ఆగిపోయిందనే వదంతులు సాగాయి. ఇన్ని రకాల ప్రచారాల తరువాత తాజాగా కార్తీ, నిత్యామీనన్ జంటగా మణిరత్నం చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సంక్రాంతి తరువాత ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. కాగా కార్తీ ప్రస్తుతం కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.మరో పక్క నాగార్జునతో కలిసి నటిస్తున్న దోస్త్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉందన్నది గమనార్హం.
మణిరత్నం చిత్రంలో కార్తీ?
Published Mon, Jan 11 2016 2:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
పరిస్థితి విషమించి యువకుడు..
అవినీతి ‘కాలువ’
తప్పక చదవండి
Advertisement