సాక్షి, చెన్నై : పార్టీ పదవుల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉన్నవారిని సాగనంపేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధమయ్యారు. పార్టీ నాయకుల పనితీరు, లోక్సభ ఎన్నికల్లో వారు వ్యవహరించిన విధానాల గురించి జిల్లాల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక ఫలితాలతో డీలాపడిన డీఎంకేను స్థానిక సంస్థల ఎన్నికలు చతికిల బడేలా చేశాయి. ఇక, లోక్సభ ఎన్నికల ఫలితాలు చావుదెబ్బ కొట్టాయి. ఘోర పరాజయంతో ఆందోళనలో పడ్డ డీఎంకే అధినేత ఎం కరుణానిధి అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. జూన్ రెండో తేదీ పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చిన కరుణానిధి జిల్లాల నుంచి నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు.
నివేదికలు : లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ శాతం జిల్లా పార్టీ నాయకులు అమ్ముడు పోయినట్టుగా నివేదికలు తేటతెల్లం చేయడంతో కరుణానిధి ఆందోళనలో పడినట్లు సమాచారం. ఏళ్ల తరబడి జిల్లాల కార్యదర్శులగాను, అధికార ప్రతినిధులగాను, పార్టీ సర్వసభ్య సభ్యులుగానూ ఉన్న నాయకులు ఈ ఎన్నికల్లో ఓటర్ల వద్దకు వెళ్లనట్టు తేలడంతో వారందరినీ బయటకు పంపించేందుకు కసరత్తుల్లో పడ్డారు. పార్టీకి విశ్వాసంగా ఉంటూ వస్తున్న ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి రహస్యంగా కరుణానిధి నివేదికలు తెప్పించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ రెండో తేదీన జరిగే పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో నివేదికల్లో వెలుగు చూసిన అంశాల మేరకు ఆయా జిల్లాల నాయకులను ప్రశ్నించడం, ఆ సమావేశం వేదికగా, వారికి ఉద్వాసన పలకడం లక్ష్యంగా కరుణానిధి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
మూడో తేదీన తన బర్తడేను పురస్కరించుకుని వైఎంసీ మైదానంలో జరిగే సభలో ఎవరెవరిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందోనన్న వివరణ ఇచ్చేందుకు కరుణానిధి సిద్ధం అవుతోన్నట్టు పేర్కొంటున్నారు. స్టాలిన్ నేతృత్వంలో యువజన విభాగం ఈ ఎన్నికల్లో చెమటోడ్చినట్టు తేలడంతో, ఆ విభాగంలో సీనియర్లుగా ఉన్న నాయకులకు పార్టీల్లో పదవులను అప్పగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో సీనియర్లుగా, జిల్లాల పార్టీల్లో వయోభారంతో ఉన్న నాయకుల వద్ద ఉన్న పదవులను లాగేసుకుని కొత్త రక్తాన్ని నింపే విధంగా జూన్ రెండో తేదీ ఉన్నత స్థాయి సమావేశం జరగనుండడంతో ప్రక్షాళన డీఎంకేలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుందో వేచి చూడాల్సిందే.
ఉద్వాసనకు సిద్ధం
Published Sun, May 25 2014 11:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement