అడ్డగోలు ప్రాజెక్టులతో అనర్థాలే | Sakshi
Sakshi News home page

అడ్డగోలు ప్రాజెక్టులతో అనర్థాలే

Published Mon, Sep 12 2016 5:04 AM

అడ్డగోలు ప్రాజెక్టులతో అనర్థాలే - Sakshi

నల్లగొండ రూరల్: రాష్ట్రంలో పద్ధతి లేకుండా చేపట్టే ప్రాజెక్టులతో ప్రజాధనం వృథా అవుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. నల్లగొండలో ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక ‘అభివృద్ధి - ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే, అడ్డగోలుగా భూములు లాక్కుంటామంటే ఊరుకోబోమన్నారు. అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు చేపడితే ప్రజాధనం వృథాతో పాటు భవిష్యత్తులో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు.

 ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలి: ఖమ్మం రూరల్: ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని కోదండరాం అన్నారు. హస్నాబాద్‌లో ఆదివారం ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు దక్కుతాయని తెలిపారు.

Advertisement
Advertisement