హైకోర్టులో లాయర్పై కొడుకు కత్తితో దాడి | Sakshi
Sakshi News home page

హైకోర్టులో లాయర్పై కొడుకు కత్తితో దాడి

Published Tue, Jul 12 2016 4:12 PM

హైకోర్టులో లాయర్పై కొడుకు కత్తితో దాడి

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై హైకోర్టులో న్యాయవాది మణిమారన్పై కన్న కొడుకే కత్తితో దాడి చేశాడు. హైకోర్టు ఆవరణలో భారీ భద్రతను తప్పించుకుని నిందితుడు కత్తితో కోర్టులోకి ప్రవేశించాడు. న్యాయవాదులు, సిబ్బంది, క్లయింట్లు చూస్తుండగానే తండ్రిపై దాడి చేసి కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో కోర్టులో ఉన్నవారు షాకయ్యారు.

పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మణిమారన్ కు, ఆయన కొడుకుకు మధ్య విబేధాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement
Advertisement