సాక్షి, ముంబై: విధాన పరిషత్ (లెజిస్లేటివ్ కౌన్సిల్) పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇది వరకే తమ అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు పేర్లను వెల్లడించలేదు. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. గవర్నర్ కోటాలో నియమితులయ్యే 12 మందిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు పేర్లను ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది.
పుణే, ఔరంగాబాద్ విధాన పరిషత్లోని పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి జూన్ 20న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలసి పోటీ చేయనున్నాయి. ఆ ప్రకారం ఎన్సీపీ రెండు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీ తమ కోటాలోని ఔరంగాబాద్ నుంచి సతీష్ చవాన్కు మళ్లీ అవకాశమివ్వగా, పుణే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సారంగ్ పాటిల్కు అవకాశమిచ్చింది.
కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఆందోళన ఎక్కువవుతోంది. అదేవిధంగా పుణే ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీకి మనీషా పాటిల్, రాజ్మానే పాటిల్, ప్రకాశ్ పాటిల్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తావ్డే కుమారుడు ప్రకాశ్ తావ్డే, నాగపూర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బబన్రావ్ తావ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగపూర్ నియోజక వర్గం నుంచి పోటీకి బీజేపీ ప్రకాశ్ సోలే పేరు ప్రకటించింది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. సీట్ల కేటాయింపుపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మధ్య రెండుసార్లు చర్చలు జరిగాయి. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు.
మోగింది ఎన్నికల నగారా
Published Tue, May 27 2014 10:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement