జీఎస్టీ బిల్లు పాసవకపోతే నష్టమొస్తుందన్న సీఎం
కాంగ్రెస్ కారణంగానే బిల్లు పాస్ కాలేదు
ఆ పార్టీ తీరుకు నిరసనగా ఈ నెల 16న ఆందోళనలు
ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా జీఎస్టీ అమలులోకి రాకపోతే రాష్ట్రం రూ.20 వేల కోట్లకుపైగా నష్టపోవాల్సి వస్తుందని సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. పార్లమెంటులో జీఎస్టీ బిల్లుపై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుండటంపై మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ జాతి ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. గత లోక్సభ ఎన్నికల ఘోరపరాజయం నుంచి ఇంకా ఆ పార్టీ కోలుకోలేదని, గాంధీ కుటుంబ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.
జీఎస్టీ బిల్లును అడ్డుకోవడం ద్వారా దేశ ప్రజల దృష్టిని కాంగ్రెస్ ఆకర్షించగలదా అని ప్రశ్నించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని తీసుకొచ్చిందని, ఆర్థిక పురోగతికి బీజం వేసిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కకూడదనే కాంగ్రెస్ ఇలా ప్రతి విషయంలోనూ అడ్డుతగులుతోందని అన్నారు. 2016 ఏప్రిల్ 1 నాటికి జీఎస్టీ బిల్లు అమలు కాకుండా పార్లమెంటు సమావేశాలు సాగనీయడం లేదని ఆరోపించారు. దేశం మెత్తం మీద రూ. 2 లక్షల కోట్లు, రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒక్క కారణం కూడా లేకుండానే కాంగ్రెస్ సమావేశాలను అడ్డుకుందని మండిపడ్డారు.
రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు నష్టం
Published Sat, Aug 15 2015 4:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement