రోజురోజుకూ తీవ్రమవుతున్న రైతుల పోరాటం
ధార్వాడ బంద్లో చెలరేగిన అల్లరి మూకలు
గోవా బస్సుకు నిప్పు దుకాణాలపై రాళ్లు
బెంగళూరు: మహదాయి నది అనుసంధానంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళనలు ఇప్పుడు హింసాత్మకంగా మారుతున్నాయి. కళసా బండూరి కాలువా పథకంతో పాటు మహదాయి న ది అనుసంధానంపై గత కొన్ని రోజులు గా హుబ్లీ-ధార్వాడ, గదగ్ జిల్లాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ అంశంపై అఖిలపక్షం ప్రధాని నరేంద్రమోదీతో నిర్వహించిన సమావేశం విఫలమైన నేపథ్యంలో ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అంతేకాక అఖిలపక్షం ప్రధానితో జరిపిన సమావేశం విఫలమైన నేపథ్యంలో బుధవారం నిర్వహించిన హుబ్లీ-ధార్వాడ బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో హుబ్లీ-ధార్వాడ జిల్లా లో పూర్తిగా జనజీవనం స్తంభించింది. బంద్ సందర్భం లో కొన్ని అల్లరిమూకలు చెలరేగాయి. ఇక ఇదే సందర్భంలో ధార్వాడలోని బస్టాండ్లో ఆగి ఉన్న గోవాకు చెందిన బస్కు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో బస్ పూర్తిగా దగ్దమైంది. ఇదే సందర్భంలో కొంతమంది ఆందోళనకారులు దుకాణాలపై రాళ్లురువ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్తంభించిన రవాణా.....
బంద్ నేపథ్యంలో ధార్వాడ జిల్లా వ్యాప్తంగా రవాణా స్తంభించింది. జిల్లాలోని కలఘటగి, కుందగోళ, నవల గుంద, నరగుంద పట్టణాలతో పాటు ఇతర అన్ని ప్రాం తాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇక బంద్ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ బస్లతో పాటు టెంపోలు, జీప్లు వంటి ప్రైవేటు రవాణా సైతం స్తంభించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. తెల్లవారుఝామున కొన్ని ప్రాంతాల్లో ఆటో సంచారం కనిపించినా, టికెట్ ధరను మూడింతలు చేసి ప్రయాణికుల నుంచి వసూలు చేయడంతో ప్రజల జేబులకు చిల్లు తప్పలేదు.
మహదాయి హింసాత్మకం !
Published Thu, Aug 27 2015 1:31 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement