సాక్షి, చెన్నై : ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలు ఎన్నికల్ని బహిష్కరించాయి. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి , అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఢీ కొట్టేందుకు సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ రేసులో నిలబడ్డారు. నామినేషన్ దాఖలు కన్నా ముందుగా, తన ఓట్ల వేటకు మహేంద్రన్ శ్రీకారం చుట్టి, ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, ఆయనకు మద్దతుగా సీపీఐ, సీపీఎం నాయకులు రంగంలోకి దిగారు.
నామినేషన్ దాఖలు : సోమవారం నాటికి అన్నాడీఎంకే అభ్యర్థి జయలలితతో పాటుగా 27 మంది తమ నామినేషన్లను సమర్పించారు. ఇందులో కొన్ని చిన్నా చితకా పార్టీల నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తండయార్ పేటలోని ఎన్నికల అధికారి కార్యాలయానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్తో కలసి అభ్యర్థి మహేంద్రన్ వచ్చారు. తన నామినేషన్, ప్రమాణ పత్రాన్ని అందజేశారు. అంతకు ముందుగా స్వతంత్ర అభ్యర్థులు పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటితో కలుపుకుంటే, ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం బరిలో నిలబడ్డ వారి సంఖ్య 38కి చేరిం ది. ఇక నామినేషన్ల పర్వం బుధవారం సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు స్వతంత్ర అభ్యర్థుల పేరిట నాలుగైదు నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. గురువారం నామినేషన్ల పరిశీలన పర్వం జరగనున్నది. ఇందులో ఎన్ని నామినేషన్లు తిరస్కరణకు గురి అవుతాయో వేచి చూడాల్సిందే.
ప్రచార హోరు : ఈ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా చిన్నా , చితక పార్టీల నాయకులు ఉన్నా, ప్రధానంగా పోటీ అన్నది అన్నాడీఎంకే, సీపీఐ మధ్య నెలకొని ఉంది. ఆ నియోజకవర్గంలో కార్మిక ఓటు బ్యాంక్ అధికమే. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గెలుపు సునాయాసమైనా, ఆమె మెజారిటీ తగ్గించే దిశగా ప్రయత్నాలు వేగవంతం అయ్యాయని చెప్పవచ్చు. తమకు బలం ఉందని చాటుకునే విధంగా సీపీఐ అభ్యర్థి సుడిగాలి ప్రచారం సాగిస్తుండడం విశేషం.
నామినేషన్ దాఖలు అనంతరం తండయార్ పేట నెహ్రూ నగర్కు చేరుకున్న మహేంద్రన్ అక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సీపీఎం రాజ్య సభ సభ్యుడు రంగరాజన్ ప్రారంభించారు. అనంతరం మహేంద్రన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇక, నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరడంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్నాడీఎంకే అభ్యర్థి,సీఎం జయలలిత తరుపున మంత్రులు వలర్మతి, వైద్యలింగం, పళనియప్పన్, సెల్లూరు కే రాజు వేర్వేరుగా ఆ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్ల సేకరణలో నిమగ్నం అయ్యారు.
మహేంద్రన్ నామినేషన్ దాఖలు
Published Wed, Jun 10 2015 3:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement