సాక్షి, బెంగళూరు:సెలవుల్లో క్రిస్మస్ వేడుకను తమ వారితో కలిసి గడిపేందుకు నగరానికి వచ్చారు. క్రిస్మస్ వేడుకలు పూర్తై అనంతరం ఆదివారం రాత్రే చెన్నైకి బయలుదేరి వెళ్లాలనుకున్నారు. కానీ విధి రాత వేరేలా ఉంది. ఆ కుటుంబానికి ఆదివారం సాయంత్రం ట్రైన్కి టికెట్లు లభించలేదు. దీంతో వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎలాగో ప్రయాణం వాయిదా పడింది కదా అని బంధువులతో కలిసి సరదాగా బయటికి వచ్చారు. అయితే వారికేం తెలుసు మృత్యువు ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి వెనకాలే వస్తోందని, బంధువులతో కలిసి సరదాగా ఫన్జోన్కు వెళ్లాలనుకుంటుండగానే బాంబు రూపంలో ఆమెను మృత్యువు కబళిం చింది.
అలా మృత్యువుకు బలైన మహిళే భవాని. ఆదివారం సాయంత్రం రైలుకే కనుక వారికి టికెట్లు లభించి ఉంటే ఈ దురదృష్టకర ఘటన జరిగి ఉండేది కాదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలు...చెన్నై నగరానికి చెందిన భవాని(38) క్రిస్మస్సెలవుల కారణంగా నగరంలోని దొడ్డమావళ్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు చెన్నైలో పాతటైర్ల వ్యాపారాన్ని నిర్వహించే భర్త బాలన్(37), పిల్లలు భరత్(13), లక్ష్మీదేవి(11)సైతం నగరానికి వచ్చారు.
క్రిస్మస్ వేడుకల అనంతరం తిరిగి ఆదివారం సాయంత్రం చెన్నైకి వెళ్లాలని భావించినా, టికెట్లు లభించక పోవడంతో ప్రయాణాన్ని సోమవారానికి వాయిదా వేసుకున్నారు. దీంతో తన బంధువులతో కలిసి చర్చ్స్ట్రీట్కు చేరుకొని ఎంపైర్ హోటల్ వద్ద తమ కారును నిలిపి ఇదే ప్రాంతంలోని ఓ ప్లేజోన్కు వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో బాంబుకు సమీపంలో నడుస్తున్న భవాని తలలోకి లోహపు పదార్థాలు బలంగా వెళ్లి గుచ్చుకున్నాయి. దీంతో ఆమె మెదడులో తీవ్ర రక్తస్రావమై భవానీ మృతి చెందారు. భవానీ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా భవానీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
టికెట్ దొరికి ఉంటే.... మృత్యువు తప్పేది
Published Tue, Dec 30 2014 7:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement