తమిళసినిమా: ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొని కలకలం పుట్టించిన హిందీ చిత్రం మెసెంజర్ ఆఫ్ గాడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ వ్యవహారంలో కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్తో సహా 9మంది సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నటుడు గుమిత్ రామ్ రహీం సింగ్ హీరోగా నటించి సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని హకిత్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శక హీరో గుమిత్ రామ్ రహీం సింగ్ బుధవారం మద్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
యువతను దృష్టిలో పెట్టుకుని మెసెంజర్ ఆఫ్ గాడ్ను రూపొందించిన కథా చిత్రం అని అన్నారు. చిత్ర వివాదాంశం గురించి మాట్లాడుతూ ఇందులో ఏ మతాన్నీ కించపరిచే విధంగా సన్నివేశాలను పొందుపరచలేదన్నారు. అయితే కొందరు ముంబయి సిటీ సివిల్ కోర్టులో చిత్రానికి వ్యతిరేకంగా పిటీషన్దాఖలు చేశారని తరువాత ఆ కేసు హైకోర్టు సుప్రీంకోర్టు అంటూ విచారణకు వెళ్లడంతో సంచలనం అయ్యిందన్నారు. సుప్రీం కోర్టు చిన్న చిన్న కట్స్తో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. చిత్రాన్ని అతి తక్కువ వ్యయంతో కేవలం 67 రోజుల్లోనే చిత్రీకరించినట్లు తెలిపారు. దీన్ని త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు గుమిత్రామ్ రహీం సింగ్ వెల్లడించారు.
విమర్శల చిత్రం విడుదలకు సిద్ధం
Published Thu, Jan 22 2015 2:36 AM
Related News by category
-
బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వ హయాం(2004–09) స్వర్ణయుగంలా సాగింది. దేశంలోనే మొదటిసారి ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించారు. ఇందుకు డిస్కంలు వెచి్చంచిన మొత్తాన్ని నయాపైసాతో సహా క్రాస్ సబ్సిడీ రూపంలో వైఎస్సార్ ప్రభుత్వం చెల్లించింది. ఉచిత విద్యుత్కు బ్రాండ్ అంబాసిడర్గా, రైతు బాంధవుడిగా, అపర భగీరథుడిగా, పేదల పక్షపాతిగా, దార్శనికుడిగా ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పాలనలో అన్ని రంగాలూ ప్రగతిపథంలో నడిచాయి. సుభిక్షమైన వర్షాలతో వ్యవసాయం పండగలా సాగింది. ఆ తర్వాత ఆ స్థాయికి మించి రైతులకు మేలు జరిగింది.. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. బాబు పాలనలో రైతుకు ఉరి (1995–2003) 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో అడుగడుగునా అన్నదాతల ఆక్రందనలే.. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు ఆడిన బాబు వేలాది మంది రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి.. సాగును చిన్నాభిన్నం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ వైఎస్సార్ను ఎగతాళి చేశారు. మరోసారి బాబు షాక్ (2014– 2019) మరోసారి చంద్రబాబు పాలన. 2014 –19 మధ్య చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఉచిత విద్యుత్ అందించినందుకు డిస్కంలకు సబ్సిడీలు చెల్లించకుండా పెండింగులో పెట్టి అప్పుల భారం పెంచేశారు. విద్యుత్ కొనుగోలు, సరఫరా మధ్య అంతరాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేయకుండా డిస్కంల వ్యవస్థను నాశనం చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. జగన్ పాలనలో విద్యుత్ ధగధగలు (2019–2024) జగన్ ప్రభుత్వం రాకతో డిస్కంలకు సబ్సిడీలు చెల్లించడంతో పాటు.. విద్యుత్ కొనుగోలు – సరఫరా మధ్య అంతరాలు ట్రూఅప్ రూపంలో కొంత సర్దుబాటు చేశారు. రైతులకు నాణ్యమైన 9 గంటల విద్యుత్ కోసం కొత్త ఫీడర్ల ఏర్పాటుతో పాటు, పాతవాటి సామర్థ్యం పెంచారు. పేదలు, రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే సబ్సిడీ భరించి.. మొత్తం రూ.46,581 కోట్లను విద్యుత్ సబ్సిడీగా అందించారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థను బలోపేతం చేశారు. విద్యుత్ వృథా కనీస స్థాయికి తగ్గించి, చోరీలకు చెక్ పెట్టారు. పారదర్శక బిల్లుల విధానం కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ పాలన స్వర్ణయుగం(2004–2009) తన పాదయాత్రలో రైతు కష్టం తెలుసుకుని.. ఆ రైతుకు ఏం కావాలో గుర్తించి అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు రాజ్యానికి శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్, సాగుకు 9 గంటల విద్యుత్ సరఫరాతో రైతుల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. జగన్ పాలనలో వెలుగుల పంట రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసేవారు. ఇందులో 9 గంటల పగటి పూట విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న ఫీడర్లు 3,854 మాత్రమే. మిగిలిన 2,809 ఫీడర్లకు జగన్ ప్రభుత్వం వచ్చాకే అదనపు సామర్థ్యం కలి్పంచారు. 2023లో రూ.2,479 కోట్లతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.620 కోట్లతో నిరి్మంచిన 12 సబ్స్టేషన్లను సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం రూ.3,099 కోట్లను వెచ్చించారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ సంస్థల అప్పులు (రూ. కోట్లలో)సంస్థ పేరు 2014నాటికి 2019నాటికి పెరిగినవి ఏపీజెన్కో 15,712.32 40,750.89 ఏపీఎస్పీడీసీఎల్ 7,140.32 14,336.15 ఏపీఈపీడీసీఎల్ 4,159.15 5,448.4 ఏపీ ట్రాన్స్కో 2,691.25 8,060.83 మొత్తం 29,703.04 68,596.27 విద్యుత్ కొను‘గోల్మాల్’ బాబు హయాంలో వాస్తవ ఖర్చులు ఎప్పటికప్పుడు చూపకపోవడంతో నిర్దేశించిన దానికన్నా వ్యయం పెరిగిపోయింది. ఫలితంగా డిస్కంలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సి వచ్చింది. వాటిపై నిరంతరం వడ్డీలు కడుతూ అవి తీర్చలేక మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి. 2016–17 మధ్య బిడ్డింగ్ ప్రక్రియలో పవన విద్యుత్ రూ.2.50 «నుంచి రూ. 2.75 ధరతో కొనుగోలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నా, పలు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల ద్వారా యూనిట్ రూ.4.84కు దాదాపు 3000 మెగావాట్ల విద్యుత్ను 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పీపీఏలతో ఏడాదికి రూ.660 కోట్ల అదనపు భారం ఖజానాపై పడింది. బాబు హయాంలో రాత్రి పూటే కరెంటు వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటలు కరెంటు సరఫరా చేయాలి. బాబు హయాంలో ఆరేడు గంటలు మాత్రమే అది కూడా రాత్రిపూటే సరఫరా చేశారు. దీంతో నీటి తడులు పెట్టేందుకు పొలాలకు వెళ్లే రైతుల్లో చాలా మంది పాము కాటుకు గురై మరణించారు. చీకట్లో అనేక మంది రైతులు విద్యుదాఘాతంతో మరణించిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంతో పోలి్చతే 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. అయినప్పటికీ రైతులకు మేలు చేసేలా విద్యుత్ సరఫరా జరిగిన దాఖలాల్లేవు. బాబు చీకట్లను పారదోలిన జగన్ చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం 5 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. పెండింగులో ఉన్న వ్యవసాయ దరఖాస్తుదారులందరికీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. దరఖాస్తు చేసిన వెంటనే కొత్త కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19.21 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఐదు లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. 39.64 లక్షల మంది లబి్ధదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) మొత్తం రూ.46,581 కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించారు. సోలార్, పవన విద్యుత్తో మంచిరోజులు రూ.3,400 కోట్లతో కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి వీటితో రానున్న రోజుల్లో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే విద్యుత్ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుంది. వేసవిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 260 మిలియన్ యూనిట్లకు పెరిగినా పక్కా ప్రణాళికతో కోతలు లేకుండా సరఫరా చేస్తారు.►రైతులకు ఉచిత విద్యుత్ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్ రూ.2.49తో సోలార్ పవర్ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. వ్యవసాయ విద్యుత్కు కావాల్సిన 13 వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 2024 సెప్టెంబర్కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ మీటర్లతో వృథా, చోరీలకు చెక్ విద్యుత్ వినియోగం పక్కాగా లెక్కకట్టి, వృథా, చోరీల్ని నియంత్రించడమే లక్ష్యంగా డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చి రైతు ఎంత విద్యుత్ వినియోగించుకున్నారో పక్కాగా లెక్కగట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు యూనిట్ వ్యయాన్ని లెక్కించి రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా జమచేస్తారు. రైతులపై పైసా భారం పడకుండా జగన్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ► అధికారంలోకి వచ్చాక సామాన్యులపై 41.04 శాతం భారం మోపిన చంద్రబాబు ► విద్యుత్ రంగాన్ని అనవసర పీపీఏలతో గాడి తప్పించిన గత టీడీపీ ప్రభుత్వం ► సబ్సిడీలు చెల్లించకుండా, ట్రూఅప్ ఛార్జీలపై తప్పుడు లెక్కలతో డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు ► టీడీపీ అధికారంలోకి రావడానికి ముందు రూ.29,703 కోట్లున్న అప్పుల్ని రూ.68,596 కోట్లకు పెంచిన ఘనుడు ► నాడు ఉచిత విద్యుత్తో దేశానికే ఆదర్శంగా ఏపీని నిలిపిన వైఎస్ రాజశేఖరరెడ్డి ►నేడు సంస్కరణలతో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాబు హయాంలో విద్యుత్ చార్జీల పెంపు (యూనిట్కు రూ.ల్లో).. నెలవారీ 2016 2018 పెరుగుదల వినియోగం (మార్చి) (ఏప్రిల్) శాతం76 140.10 197.60 41.04 78 145.30 202.80 39.57 80 150.50 208.00 38.21 82 155.70 213.20 36.93 85 163.50 221.00 35.17 88 171.30 228.80 33.57 90 176.50 234.00 32.58 92 181.70 239.20 31.65 95 189.50 247.00 30.34 98 197.30 254.80 29.14 100 202.50 260.00 28.40 రైతు బాంధవుడు వైఎస్సార్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అమలుతో సంచలనం సృష్టించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి రైతులు నయాపైసా చెల్లించనక్కర్లేకుండా ఉచిత విద్యుత్ పొందే అవకాశం లభించింది. ఆ రోజు వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.1,259 కోట్లు రద్దయ్యాయి. దేశంలో మొదటిసారిగా ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించిన ప్రభుత్వం వైఎస్సార్దే. ఉచిత విద్యుత్ కోసం పంపిణీ సంస్థలు వెచ్చించిన ప్రతి పైసాను ప్రభుత్వం సబ్సిడీగా అందించింది. విద్యుత్ రంగం ప్రగతిబాట గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పలు చర్యలు చేపట్టింది. డిస్కంలకు ఠంచనుగా సబ్సిడీలు చెల్లిస్తోంది. దీంతో గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్లను çడిస్కంలకు సబ్సిడీల రూపంలో చెల్లించింది. ఇది గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో చెల్లించినదానికంటే దాదాపు రెండున్నర రెట్లు అధికం కావడం గమనార్హం. జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పక్కాగా ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత సరఫరా చేస్తున్నారు. చేతివృత్తుల వారికి, ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇస్తున్నారు. ఆక్వా రైతుల నుంచి యూనిట్కు రూ.1.50 మాత్రమే వసూలు చేస్తూ, రాయితీ రూ.3.50 ప్రభుత్వమే భరిస్తోంది. ఏటా రూ.12 వేల కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది. బాబు తప్పులు.. డిస్కంలకు అప్పులు చంద్రబాబు ఏలుబడి(2014–19)లో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. బాబు సర్కారు డిస్కంలకు క్రాస్ సబ్సిడీని సక్రమంగా చెల్లించలేదు. విద్యుత్ కొనుగోలు, సరఫరా మధ్య అంతరాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేయలేదు. దీంతో డిస్కంలు దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేసవిలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు దిగిపోయే నాటికి డిస్కంలకు ప్రభుత్వం రూ.13 వేల కోట్లకు పైగా బకాయి పెట్టింది. 2014–15 నుంచి 2018–19 మధ్య పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసరాలు తక్కువ చేసి చూపడంతో నిర్దేశిత వ్యయం కంటే వాస్తవ వ్యయం రూ.19 వేల కోట్లు ఎక్కువైంది.ఈ మొత్తంపై ట్రూ ఆప్ సవరణల కోసం విద్యుత్ నియంత్రణ మండలికి నివేదికలు సమరి్పంచలేదు. గత ప్రభుత్వం హయాంలో వార్షిక ఆదాయ, ఖర్చుల నివేదికలు సక్రమంగా సమరి్పస్తే.. ప్రభుత్వం కూడా ఆమేరకు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చేది. సబ్సిడీ భారాన్ని తప్పించుకునేందుకు వాస్తవ వ్యయం చూపకపోవడంతో డిస్కంలు నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో బాబు హయాంలో సబ్సిడీ పెండింగులో పెట్టిన మొత్తం రూ.13 వేల కోట్లు, వాస్తవాలు చూపకపోవడంవల్ల ఏర్పడిన నష్టం రూ.19 వేల కోట్లు కలిపి మొత్తం రూ.31 వేల కోటక్లుపైగా డిస్కంలు నష్టాల్లో కూరుకుపోవాల్సి వచి్చంది. మా మంచి కోసం స్మార్ట్ మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, చోరీ, మరమ్మతులకు గురైనా ఆ ఖర్చులు విద్యుత్ కంపెనీలే భరిస్తాయని హామీ ఇచ్చారు. మేం పైసా కట్టకుండా మీటర్ పెడతామన్నారు. మాకు తొమ్మిది గంటలు పగలు కరెంటు ఇస్తున్నారు. దానివల్ల మా పంటలు బాగా పండుతున్నాయి. –ఎం.కృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం కరెంటుకు ఢోకా లేదు ఇది వరకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇబ్బంది పడేవాళ్లం. ఒకే ట్రాన్స్ఫార్మర్పై మూడు సరీ్వసులుంటే ట్రాన్స్ఫార్మర్ బాగుచేయడానికి ఒకరొస్తే ఇంకొకరు రావడం కుదిరేది కాదు. మోటార్లు ఒకటి కాలిపోతే పక్కవి కూడా కాలిపోయేవి. ఏ మోటర్ దగ్గర సమస్య ఉందో తెలుసుకోవడానికి అన్ని బోర్ల దగ్గరకు తిరిగేవారం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలడం చాలా అరుదు. దెబ్బతిన్నా వెంటనే బాగవుతోంది. –రుద్ర సూర్యనారాయణ, కౌలు రైతు, కృష్ణాపురం -
అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో కులం, మతం, వివక్ష, అనేది ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదు. ఇందుకు నవరత్నాల ద్వారా పథకాలు పొందిన లబ్ధిదారులే తార్కాణం. పేదలైతే చాలు వారు ఏ కులానికి చెందిన వారైనా ఆఖరికి తనకు ఓటు వేయని వారికి కూడా నవరత్నాల్లో ఆర్థిక ప్రయోజనం కల్పించారు.ఇందులో భాగంగానే సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనతో అగ్ర వర్ణ పేదలందరికీ భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్ర వర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. తొలిసారిగా సీఎం జగన్ పాలనలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి)రూ.51,457.56 కోట్ల లబ్ధి చేకూర్చారు. అగ్రవర్ణ పేదలకు ఈ ఐదేళ్లలో అందిన లబ్ధి ⇒ నగదు బదిలీ ద్వారా – రూ.43,648.75 కోట్లు ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులు – 9,97,728 ⇒ వారి ఖాతాలకు జమ అయిన నిధులు – రూ.7,025.42 కోట్లు ⇒ నాన్ డీబీటీ ద్వారా అంటే ఆరోగ్య శ్రీ, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాల భూ సేకరణ వంటి పథకాలకు – రూ.7,808.81 కోట్లు ⇒ నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతవాసులే ⇒ జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించారు. ⇒ మేనిఫేస్టోలో చెప్పిన మేరకు అన్ని అగ్ర కులాలకు (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ) తదితరులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు ⇒ చంద్రబాబు పాలనలో పెన్షన్, రేషన్ కార్డు టీడీపీ వారికే అందేవి. ⇒ ఆ తరువాత కులం ప్రాతిపదికన రేషన్ కార్డు, పెన్షన్ మంజూరు చేసేవారు. ⇒ లంచం ఇస్తే తప్ప మంజూరు చేసేవారు కాదు. -
డిసైడ్ చేసేది.. ఆమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేపు జరగనున్న ఎన్నికల్లో ‘విజేత’ను మహిళలే నిర్ణయించబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 స్థానాల్లో మహిళా ఓటర్లదే పై చేయి. ఇందులో ఏకంగా 70 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా నాలుగు వేల నుంచి పది వేలకు పైగా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో విజేతల తలరాతను మహిళా ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో మహిళల నిష్పత్తి పెరుగుతూనే ఉంది.2014తో పోల్చి చూస్తే 2019లో మహిళా ఓటర్ల పోలింగ్ కూడా భారీగా పెరిగింది. అదేవిధంగా ఈ నెల 13న అసెంబ్లీకి, లోక్సభకు జరిగే పోలింగ్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. పోలింగ్లో పాల్గొనే మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో రాష్ట్రంలో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న యువతులు దాదాపు నాలుగు లక్షల మంది తమ ఓట్లు నమోదు చేసుకున్నారు.2019లో మాదిరిగానే ఈసారి కూడా పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని చోట్లా పెద్ద ఎత్తున మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాల లబ్ధిదారుల్లో కూడా మహిళలే అత్యధికంగా ఉన్నందున.. వారంతా ‘ఫ్యాన్’కు ఓటు వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు.మహిళా కూలీల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు, గృహిణులు, యువతులు వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే వాతావరణం అన్ని నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో పాటు సొంతింటి కల నెరవేరిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘నవరత్నాల ద్వారా మహిళలకు ఏకంగా రూ.2,83,866.33 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది.ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,89,519.07 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347.26 కోట్లు ప్రయోజనం చేకూరింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీకి బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. అందువల్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ మొదలైంది. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రా ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఎల్లుండి పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు ఓటర్లు పయనమవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది.పోలింగ్కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శనివారం వేకువజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి 508 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బెంగుళూరు నుంచి ఏపీకి 592 స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు నడపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. -
లాండ్ టైట్లింగ్ చట్టం - అబద్దాలు vs నిజాలు
“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుందిe.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.“మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది. 2. “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.3. “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు. ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?చట్టం తయారీ, రాష్ట్రపతి ఆమోదం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం తయారీ కోసం లీగల్ అడ్వైజర్ గా నల్సార్ యూనివర్సిటీ (NALSAR) వారిని నియమించుకోవడం జరిగింది . నల్సార్ యూనివర్సిటీ వారి ఈ చట్టం యొక్క డ్రాఫ్ట్ ప్రిపరేషన్ కి సహకరించారు. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ నమూనా చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును 2019 లో మన రాష్ట్ర శాసనసభ లో ప్రవేశపెట్టినప్పుడు సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత టిడిపి కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తరువాత ఆమోదించి గౌరవ రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపించబడింది. భారత ప్రభుత్వం లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సాంఘిక సంక్షేమ శాఖ మొదలైన డిపార్ట్మెంట్లన్నీ మూడు సంవత్సరాలు జాగ్రత్తగా పరీక్షించి, వారు చేసిన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి మరలా రాష్ట్ర శాసనసభ లో ఆమోదింపబడిన తరువాత తిరిగి రాష్ట్రపతి ఆమోదమునకు పంపడం జరిగింది. ఈ చట్టం భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏ చట్టంతోను విభేదించటం లేదు అని నిర్ధారించిన తర్వాత మాత్రమే భారత రాష్ట్రపతి వారి ఆమోదం ఇవ్వడం జరిగింది. కనుక ఈ చట్టము కూలంకషంగా చర్చ జరిగిన తరువాత తెచ్చిన చట్టము. చట్టం అమలు – ప్రస్తుత స్తితి:ఈ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ తయారు చేసి ఉండలేదు. ఈ చట్టం యొక్క పరిధి (Areas Covered) ని ఇంకా నిర్ధారించి ఉండలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేయబడిన అధికారులను ఇంకా అపాయింట్ చేసి కూడా ఉండలేదు. ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను, సూచనలను తీసుకొని అవసరమైనటువంటి మార్పులను, చేర్పులను చేయుటకు సిద్ధంగా ఉంది. రూల్స్ తయారు చేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. న్యాయవాదుల సంఘాలు, వ్యక్తులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో రిట్ పీటీషన్స్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయగా సదరు పిటిషన్ లన్నింటిని విచారించి, ఈ చట్టాన్ని ప్రస్తుతం అమలుపరచడం లేదు కనుక, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులను విచారించుచూ, కొత్త కేసులను కూడా తీసుకోవాల్సిందిగా సివిల్ కోర్టులను ఆదేశించి ఉన్నారు.( No. WP(PIL).Nos.215, 216 of 2023, WP.No.33763 of 2023, WP(PIL). Nos.2 & 3 of 2024 and W.P.Nos. 22 & 23 of 2024). జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి.Sl. Noనాడు(2014 – 19)నేడు(2019 – 24)1అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ లబ్ధిదారులను, బెదిరించి, తెల్ల కాగితాలపై అసైనీల సంతకాలు తీసుకుని, వారి భూములు బలవంతంగా లాక్కుని ప్రభుత్వం ద్వారా APAL (POT) యాక్ట్ ప్రొవిజన్స్ కు విరుద్ధంగా ఉత్తర్వులు ఇచ్చి లబ్ధిదారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. దీనికి సంబంధించి కేసులు కూడా చేయడం జరిగింది Details of FIRs:14/2020 of CID PS AP Mangalagiri.15/2020 of CID PS AP Mangalagiri.5/2021 of CID PS AP Mangalagiri.20 సంవత్సరములు నిండిన తర్వాత అసైన్మెంట్ పొందిన లబ్ధిదారులకు వారి వారసులకు ఆ భూములపై పూర్తి హక్కులను కల్పించడం జరిగింది. దీనివలన 15,21,160 మంది లబ్ధిదారులకు 27,41,698 ఎకరాల భూమి పై పూర్తి హక్కులు లభిస్తున్నాయి.2ఒక్క సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు31,65,315 మంది లబ్ధిదారులకు 71,811 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. 17005 జగనన్న లేఅవుట్ లు అభివృద్ధి చేయడం జరుగుతోంది.3నాడు చుక్కల భూములన్నీ కూడా చుక్కల భూముల చట్టానికి వ్యతిరేకంగా 22A కింద పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి నాటి ప్రభుత్వం బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేసింది.1,07,134 మంది రైతులకు సంబంధించిన 2,06,315 ఎకరాల చుక్కల భూమిని 22A నుండి తీసివేసి వారికి సంపూర్ణ హక్కులు ఇవ్వడం జరిగింది.4పేదలకు సంబంధించిన సర్వీస్ ఈనామ్ భూములను 22A లో పెట్టి వారిని చాలా ఇబ్బంది పెట్టి నాటి ప్రభుత్వ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసింది.1,61,584 మంది ఈనామ్ దారుల 1,58,113 ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనామ్ భూములను 22 A నుండి తొలగించి సర్వహక్కులు కల్పించడం జరిగింది.5బ్రిటిష్ కాలం నుండి ఉన్న రైతులకు సంబంధించిన షరతులు గల పట్టాలను 22A లో పెట్టి బలవంతంగా లాక్కున్నారు.22,042 మంది రైతులకు సంబంధించి 33,394 ఎకరాల షరతులు గల పట్టాల భూమిని 22 ఏ నుంచి తీసివేసి వారికి సర్వహక్కులు కల్పించడం జరిగింది.6భూమిలేని నిరు పేదలకు ఒక్క ఎకరా భూమి కూడా పంచలేదు.42,307 మంది భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాలు సాగుభూమి పంచడం జరిగింది.7గిరిజనులకు ప్రభుత్వ భూమి అసైన్మెంట్ ఒక్క ఎకరా కూడా చేయలేదు.26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల్లో DKT పట్టాలు ఇవ్వడం జరిగింది8గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ (RoFR) కింద పట్టా ఒక్కటి కూడా ఇచ్చి ఉండలేదు1,30,368 మంది గిరిజనులకు 2,87,710 ఎకరాల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చారు.9ఒక్క ఎకరా లంక ల్యాండ్స్ కు పట్టా కానీ లీజు గాని ఇవ్వలేదు17,768 మంది లబ్ధిదారులకు 9,064 ఎకరాలలో పట్టాలు / లీజులు ఇవ్వడం జరిగింది.10ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చిన భూములను 22A లో పెట్టి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు.ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి 22,346 మంది లబ్ధిదారులకు ఇచ్చిన 22,837ఎకరాల భూములను 22a నుండి తీసివేసి వారికి పూర్తి హక్కులను కల్పించారు
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Photos
View allVideo
View allతప్పక చదవండి
- Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం
- రేవంత్కు మతి భ్రమించింది
- Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
- కూటమి వస్తే ప్రధాని ఎవరు?
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
- డిసైడ్ చేసేది.. ఆమే!
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
Advertisement