సాక్షి, ముంబై: తమ డిమాండ్ల సాధనకోసం మిల్లు కార్మికులు నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు శని వారం సాయంత్రం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిర్ని కామ్గార్ ఏక్ జూట్ యూని యన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు, కార్మికులు భారీసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక కాలాచౌకిలోని షహీద్ భగత్సింగ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లాల్బాగ్, ఆర్థర్ రోడ్, లోయర్ పరేల్ల మీదుగా వర్లివరకు కొనసాగింది. అనంతరం వర్లిలోని అంబేద్కర్ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన సభలో పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ మిల్లు కార్మికులకు లేదా వారి వారసులకు ఉచితంగా ఇళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వ్యయాన్నికార్మికుల వద్దనుంచి కాకుండా మిల్లు యజ మానుల నుంచిగానీ లేదా బిల్డర్ల నుంచి గానీ వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్మికులందరికీ అర్హతపత్రాలు జారీ చేయాలని, అదేవిధంగా గత ఏడాది నిర్వహించిన లాటరీలో ఇళ్లు వచ్చిన కార్మికులను సంబంధిత అధికారులు ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని వక్తలు కోరారు. సాధ్యమైనంత త్వరగా ఇళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని, ఎన్టీసీ అధీనంలోని 90 హెక్టార్ల స్థలంలో కార్మికులకు ఇళ్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాం డ్ చేశారు. ఈ ర్యాలీలో కిశోర్ దేశ్పాండే, గన్నారపు శంకర్, ఉదయ్భట్, బబన్మోరే, మందాకినీ చవాన్ తదితరులు పాల్గొన్నారు.
మిల్లు కార్మికుల ర్యాలీ
Published Mon, Dec 16 2013 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement