సాక్షి, ముంబై: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన మంత్రాలయ బోసిపోయింది. రాష్ర్టంలో 48 లోక్సభ నియోజకవర్గాలకు మూడు దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంత్రాలయవైపు మంత్రులు రావడం మానేశారు. గురువారం మంత్రాలయ పరిసరాలు బోసిపోయి కనిపించాయి. ఎన్నికల షెడ్యూల్ప్రకటించే అవకాశాలున్నాయని తెలుసుకున్న మంత్రులు ఇప్పటికే తమ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. బుధవారం సాయంత్రం కేబినెట్ సమావేశం జరగాల్సి ఉన్నా రద్దు చేశారు.
దీనికితోడు రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఔరంగాబాద్కు రావడంతో అక్కడికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్తోపాటు కీలక శాఖల మంత్రులు కూడావెళ్లారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన కార్యక్రమాలన్ని రద్దుచేసుకుని మంత్రాలయకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడ్డారు. లోక్సభ ఎన్నికలు ఫలితాలు వెలువడేంత వరకు మంత్రాలయలో పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.
బోసిపోయిన సందర్శకుల పాస్ కౌంటర్లు...
వివిధ పనుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది మంత్రులతో భేటీ అయ్యేందుకు మంత్రాలయానికి వస్తుంటారు. అయితే ఎన్నికల కోడ్ కూయడంతో గురువారం మంత్రాలయ భవనం ప్రధాన ప్రవేశద్వారం వద్ద విజిటర్స్ పాస్లు జారీచేసే కౌంటర్లు బోసిపోయి కనిపించాయి. నిత్యం జనం రాకపోకలతో కిటకిటలాడే మంత్రాలయ పరిసరాల్లో గురువారం ఏమాత్రం రద్దీ కనిపించలేదు. తనిఖీ, భద్రతా సిబ్బందిని కూడా తగ్గించారు. మంత్రులు లేక క్యాబిన్లు, చాంబర్లు, బయట కుర్చీలన్నీ వెలవెలబోయాయి. మంత్రాలయ భవన్లోని ఆరు అంతస్తుల్లో ఉద్యోగులు, గేట్ల వద్ద పోలీసులు కనిపించారు.
బుగ్గ కారుతో జాగ్రత్త!
ప్రభుత్వ అధికారులతోపాటు బీఎంసీ ఉన్నతాధికారులపై ఎన్నికల కోడ్ ప్రభావం కనబడుతోంది. బుగ్గ (బెకాన్) కారులు కేవలం ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లడానికి మాత్రమే వినియోగించాలని అధికారులకి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయనుంది. తమ వ్యక్తిగత పనులకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు వెళ్లేందుకు బుగ్గవాహనాలను వాడరాదని హెచ్చరించనుంది. లేనిపక్షంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద వారిపై కేసులు నమోదుచేసే ప్రమాదం ఉంది.
కోడ్ అమలులో ఉన్నంత కాలం వ్యక్తిగత పనులకు బుగ్గ వాహనాలు వినియోగించకూడదని మేయర్, సభాగృహం నాయకుడు, బీఎంసీ ప్రతిపక్షనాయకుడు, న్యాయ శాఖ, ప్రత్యేక కమిటీ అధ్యక్షులకి సూచించనున్నట్లు అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని చెప్పారు. దీనిపై మేయర్ సునీల్ ప్రభు మాట్లాడుతూ మేయర్ బంగ్లా నుంచి బీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు బుగ్గ వాహనాన్ని వాడతానని స్పష్టం చేశారు. సొంత పనులకు, రాజకీయ, ఇతర కార్యక్రమాలకు బెస్ట్ బస్సు, లోకల్ రైలులాంటి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తానని స్పష్టం చేశారు. బీఎంసీకి చెందిన వివిధ శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఉద్యోగులందరూ సాధ్యమైనంత వరకు బుగ్గ వాహనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
కళ తప్పిన మంత్రాలయ
Published Thu, Mar 6 2014 10:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement