మొత్తం ఓట్లు 112.. పోలైంది 123 | Sakshi
Sakshi News home page

మొత్తం ఓట్లు 112.. పోలైంది 123

Published Thu, Mar 9 2017 4:18 PM

MLC poll for Teachers' constituency in andhra pradesh

ఎర్రగుంట్ల: ఏపీలో జరుగుతున్న టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వింత చోటు చేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లలోని 36వ పోలింగ్‌ బూత్‌లో ఈ ఘటన జరిగింది. పోలింగ్‌ బూత్‌ పరిధిలో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగిన పోలింగ్‌లో 123 ఓట్లు పోలయ్యాయి. ఉన్న ఓట్ల కంటే అదనంగా11 మంది ఓటు వేశారు. పోలింగ్‌ బూత్‌ ప్రిసైండింగ్‌ అధికారి ఫయాజుద్దీన్‌ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై ఫయాజుద్దీన్‌ పైఅధికారులతో చర్చిస్తున్నారు. దొంగ ఓట్లు ఏమైనా పోల్‌ అయ్యాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement