సాక్షి ప్రతినిధి, బెంగళూరు : టెక్నాలజీలో దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ముందుండే కర్ణాటకలో మరో వినూత్న ప్రాజెక్టు ప్రారంభం కానుంది. మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులు ప్రభుత్వ సేవలు పొందడమే ఈ పథకం ప్రధానోద్దేశం. ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ఎప్పుడో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
‘యూనిఫైడ్ మొబైల్ గవర్నెన్స్ ప్లాట్ఫాం’ అనే ఈ ప్రాజెక్టుపై సిబ్బంది వ్యవహారాలు, పాలనా సంస్కరణల శాఖ దాదాపు ఏడాదిగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ ఫోన్ల ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవల కంటే ఈ ప్లాట్ఫాం భిన్నమైనది. అవన్నీ ఇంటర్నెట్ ఇంటర్ఫేస్ ఆధారంగా పని చేస్తున్నాయి. కొత్త సిస్టంలో మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఈ నెల 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ప్రారంభోత్సవం కలకాలం గుర్తుండిపోయేలా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు అధికారిక ఆహ్వాన పత్రికల్లో ఆడియో చిప్స్ను అమర్చడం ద్వారా అతిథులు వాటిని తెరవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుభాకాంక్షలు తెలిపే సందేశం వినిపిస్తుంది. పుష్, పుల్, పేమెంట్, డేటా కాప్చూర్ అనే నాలుగు మొబైల్-గవర్నెన్స్ సేవలు ఈ ప్లాట్ఫాం ద్వారా రాష్ట్ర పౌరులకు అందనున్నాయి. పుష్ సేవల కింద వివిధ ప్రభుత్వ శాఖలు పంపే ఎస్ఎంఎస్లు పౌరులకు అందుతాయి.
ఇందులో దరఖాస్తులకు రసీదులు, దరఖాస్తుల స్థితిగతులపై సమాచారం, ట్రాఫిక్ అప్రమత్తత తదితరాలుంటాయి. పుల్ సేవల కింద ప్రభుత్వ సమాచారాన్ని పొందవచ్చు. దీని ద్వారా బస్సు వేళలు, నిర్దుష్ట ప్రదేశాల్లో భూముల మార్గదర్శక విలువలను తెలుసుకోవచ్చు. టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని కాంట్రాక్టర్లు పొందవచ్చు. పేమెంట్ సేవల కింద కరెంటు, నీటి బిల్లులు, ఆస్తి పన్ను, ట్రాఫిక్ జరిమానాలను చెల్లించవచ్చు. డేటా కాప్చూర్ సేవలు పాలనాపరమైనవి. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అప్లికేషన్ల ద్వారా ఈ సేవలను వినియోగించుకుంటారు.
మొబైల్లో ప్రభుత్వ సేవలు
Published Thu, Oct 9 2014 2:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement