సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై రోజురోజుకు జనారణ్యంగా మారుతోంది. ఇటీవలి కాలంలో ముంబైకి భారీగా వలసలు పెరిగిపోవడంతో ఖాళీ స్థలాలు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రతీ మనిషికి సగటున రెండు చదరపు మీటర్ల స్థలం ఉంది. కానీ వలసలు ఇదే రీతిలో కొనసాగితే 1.24 చ.మీ.కు చేరుకోనుంది. ఖాళీ స్థలాలు తగ్గిపోయి, జనసాంద్రత పెరిగిపోతే దాని దుష్ర్పభావం ముంబైకర్ల ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముంబై జనాభా, ఖాళీ స్థలాలపై గట్ నాయకులు తాత్కాలికంగా రూపొందించిన అభివృద్థి మ్యాప్ సీడీని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే తిలకించారు. నగరానికి నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వస్తుంటారు. వీరిలో కొందరు ఉపాధి నిమిత్తం, మరికొందరు ఉద్యోగ రీత్యా వచ్చిపోతుంటారు. ఉపాధి కోసం వచ్చిన వారు ఇక్కడే స్థిరపడతారు. నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణ పనులు, ఫ్లైఓవర్లు, మెట్రో, మోనో లాంటి అనేక కీలక ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. దీంతో క్కడ ఉపాధికి కరువు ఉండదని భావించిన పేదలు, నిరుద్యోగులు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు.
వీరి కారణంగా నగర పరిసర ప్రాంతాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. మురికివాడలే కాకుండా ఫుట్పాత్లు, ఖాళీ మైదానాలు కూడా సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణలు, మురికి వాడలు దర్శనమిస్తున్నాయి. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవడంతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముంబైలో ఎక్కడ చూసిన జనం, రద్దీ కనిపించడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.
జనారణ్యంగా మారుతున్న ముంబై
Published Wed, Feb 18 2015 11:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement