సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్ప్రెస్ వేపై జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం కార్లలో ప్రయాణిస్తున్న వారే మృతి చెందారు. రోడ్డు ప్రమాదానికి గురైన వివిధ వాహనాల్లో మరణించిన సంఖ్యతో పోలిస్తే వీరి సంఖ్య 58 శాతం ఉన్నట్లు ‘జేపీ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాలు, అందులో మృతుల సంఖ్య పెరగడానికి గల ప్రధాన కారణాలను తెలుసుకునేందుకు ఇటీవల కోయంబత్తూర్కు చెందిన జేపీ రీసెర్చ్ కంపెనీ సర్వే చేసింది.
వాహనాలు అధిక వేగంగా వెళ్లే రహదారిగా గుర్తింపు పొందిన ముంబై-పుణే ఎక్స్ప్రెస్ వే పై ఏటా కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు మృతి చెందుతున్నారు. వీటిని అరికట్టేందుకు జాతీయ రహదారుల శాఖ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మానవ తప్పిదమో, లేక సాంకేతిక లోపమో కానీ పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. దీంతో అసలు ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయోనని వివరాలు తెలుసుకునేందుకు జేపీ రీసెర్చ్ కంపెనీ సర్వే చేపట్టింది. 2012 నవంబర్ నుంచి 2013 అక్టోబర్ వరకు 214 రోడ్డు ప్రమాదాలను అధ్యయనం చేసింది.
ఇందులో ముంబై-పుణే న గరాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలే ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయి. ఇవి కామ్శేత్ ఘాట్ పరిసరాల్లోనే జరిగాయి. 55 శాతం ప్రమాదాలు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల, 46 శాతం సీటు బెల్టు పెట్టుకోకపోవడంవల్ల జరిగాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల లోపు జరిగిన ప్రమాదాలు 58 శాతం ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్ల నిద్రమత్తు డ్రైవింగ్ వల్ల 75 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం ప్రమాదాల్లో 81.5 శాతం మానవ తప్పిదంతో, మిగతావి వాహనాల సాంకేతిక లోపంతో జరిగాయి. రోడ్లు, మౌలిక సదుపాయాల కొరతవల్ల 24.9 శాతం ప్రమాదాలు జరిగినట్లు జేపీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. మొత్తంగా అత్యధిక శాతం ప్రమాదాలు డ్రైవర్లకు నిద్రముంచుకురావడం వల్లే జరిగాయని తుది నివేదికలో వెల్లడించింది. ఈ రహదారిపై జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 67 శాతం కేసులు నమోదు చేయలేద ని తెలిపింది.
ఫలితం లేని ప్రచార కార్యక్రమాలు
ప్రాణం ఎంతో విలువైంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఇతర ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే తపన, అందుకు వాహన వేగాన్ని పెంచడం, విశ్రాంతి లేకుండా డ్రైవర్ వాహనాన్ని డ్రైవింగ్ చేయడం తదితర కారణాలు ప్రమాదాలకు ఊతమిస్తున్నాయి. ఫలితంగా అమాయకులు ఇందులో ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాద‘కారు’లు
Published Fri, Jan 10 2014 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement