* పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
* అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
సాక్షి, ముంబై: పట్టపగలు, నడి రోడ్డుపై హత్యలు జరుగుతుంటే హంతకులు ఎలా తప్పించుకుంటున్నారని బొంబాయి హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు విభాగాన్ని కోర్టు ఆదేశించింది. పుణేలో మూఢ నమ్మకాల నిర్మూలన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర ధబోల్కర్, ముంబైలో ఆంగ్ల దిన పత్రిక సీనియర్ రిపోర్టర్ జేడే, పుణేలో నిఖిల్ రాణే, సమాచార హక్కు కార్యకర్త సతీష్ శెట్టి తదితరులు పట్టపగలు, రోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు.
హంతకులు వస్తున్నారు, శవాలను చేసి పారిపోతున్నారు. కానీ ఆ హంతకులను మాత్రం ప్రభుత్వం పట్టుకోలేకపోతోంది. పుణేలో నడిరోడ్డుమీద నిఖిల్ రాణేపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటన జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ నిఖిల్ భార్య అశ్విని రాణే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిటిషన్పై న్యాయమూర్తులు వి.ఎం.కానడే, శాలినీ ఫన్సాల్కర్ జోషిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నడిరోడ్డుపై, పట్టపగలు జరిగిన అనేక హత్య కేసులను పోలీసులు ఛేదించలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.
హంతకులు విచ్చలవిడిగా తిరగడంవల్ల సామాన్య ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని అశ్వినీ రాణే తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలు విఫలమైనట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు. అయితే తమ వద్ద అత్యాధునిక ఆయుధాలు లేకపోవడంవల్లే హంతకులు, నేరస్తులు తప్పించుకుపోతున్నారని క్రితంసారి జరిగిన విచారణ సందర్భంగా పోలీసు శాఖ స్పష్టం చేసింది. నియమాల ప్రకారం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఆయుధాలకు సంబంధించిన విధానాన్ని సమీక్షించాలి.
కానీ 2010 తరువాత ప్రభుత్వం ఇటువైపు దృష్టిసారించలేదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ముంబై పోలీసుల వద్ద ఇప్పటికీ పాత కాలం నాటి తుపాకులు, రివాల్వర్లు ఉన్నాయి. వాటిని భుజానికి వేసుకుని వెళుతుండగా లేదా శుభ్రం చేస్తుండగా పేలుతున్నాయే (మిస్ ఫైర్) తప్ప అవసరమైనప్పుడు పేలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హంతకులను, నేరస్తులను సకాలంలో పట్టుకోలేకపోతున్నారని పోలీసు శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
హంతకులు ఎందుకు చిక్కడం లేదు?
Published Sat, Jan 17 2015 5:01 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement