Sakshi News home page

బ‍్యాంకులకూ కరెన్సీ కష్టాలు

Published Wed, Nov 30 2016 12:45 PM

బ‍్యాంకులకూ కరెన్సీ కష్టాలు - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చాలా చోట్ల బ్యాంకుల్లో కొత్త కరెన్సీ అందుబాటులో ఉండటం లేదు. డిమాండ్‌కు సరిపడా కొత్త నోట్లను బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంకు సరఫరా చేయలేకపోతోంది. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో నగదు ఇవ్వకుండా, డిపాజిట్లు మాత్రమే చేయించుకుంటున్నారు.

ఇక ఉద్యోగులకు జీతాల కష్టాలు తప్పడం లేదు. నెల జీతం వచ్చినా బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. దీంతో బ్యాంకు ఖాతాలో డబ్బు ఉన్నా నెల మొదట్లో ఖర్చుల కోసం సమస్యలు తప్పకపోవచ్చు. దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కష్టాలు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
Advertisement