సాక్షి, ముంబై: సైన్-పన్వేల్ జాతీయ రహదారిని 10 లేన్లు (5+5)గా మార్చే పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్షాకాలానికి ముందే ఈ రహదారిని ప్రారంభించేందుకు పీడబ్ల్యూడీ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నిత్యం పుణే, కొంకణ్, గోవా దిశగా వెళ్లే లక్షలాది వాహనాలకు ఒక వరంగా పరిణమించనుంది. ముఖ్యంగా ప్రతీ వర్షా కాలంలో ఈ రహదారిపై వాహన చోదకులు పడే ఇబ్బందుల నుంచి శాశ్వతంగా విముక్తి లభించనుంది. ఎక్స్ప్రెస్ హై వే మీదుగా పుణే నుంచి పన్వేల్ వరకు 120 కి.మీ. ప్రయాణానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది.
అదే పన్వేల్ నుంచి ముంబై వరకు దాదాపు 50 కి.మీ ప్రయాణానికి మాత్రం రెండున్నర గంటలకు పైనే పడుతోంది. పుణే, ముంబై నగరాలు వాణిజ్యపరంగా దినదినాభివృద్థి చెందుతున్నాయి. దీంతో ఇరు నగరాల మధ్య రోజూ వచ్చిపోయే వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఈ రెండు నగరాల్లో ఏ రహదారిపై చూసినా ట్రాఫిక్ జాం కనబడుతోంది. భవిష్యత్తులో ఇది మరింత జటిలమయ్యే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైన్-పన్వేల్ల మధ్య (ప్రస్తుతం 2+2 లేన్లు ఉన్నాయి) 10 లేన్ల రహదారి నిర్మిస్తే బాగుంటుందని పీడబ్ల్యూడీ ప్రభుత్వానికి సిపార్సు చేసింది. దీంతో బీఓటీ పద్ధతిలో ఈ రహదారిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.1,220 కోట్లతో ఈ భారీప్రాజెక్టు పనులు రెండేళ్ల కిందట ప్రారంభించింది.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2014 మే ఆఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే తారు రోడ్డా లేదా సీసీ రోడ్డా అనే అంశంపై ప్రారంభంలో నెలకొన్న వాగ్వాదంవల్ల పనులు తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ జూన్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. సైన్-పన్వేల్ రహదారి మధ్యలో ఉన్న ఖార్ఘర్ వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే టోల్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఖార్ఘర్ వద్ద ఏర్పాటు చేయనున్న టోల్ప్లాజాలో ఎంతమేర వసూలు చేయాలనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ రహదారిపై వివిధ జంక్షన్ల వద్ద చిన్న, పెద్ద ఇలా మొత్తం ఐదు ఫ్లైఓవర్లు ఉన్నాయి. వీటి పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.
తుది దశలో పది లేన్ల రోడ్డు
Published Tue, May 27 2014 10:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement