గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు

Published Wed, Nov 16 2016 3:47 PM

police rides on gudumba centers in warangal

కేససముద్రం: వరంగల్ జిల్లా కేససముద్రం మండలం గిర్నితండాలో బుధవారం గుడుంబా స్థావరాలపై దాడులు జరిగాయి. వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, గూడూరు ఎక్సైజ్ అధికారులు కలిసి ఒక్కసారిగా దాడులు నిర్వహించి 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి వాడే కుండలను, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement