తుమకూరు : ప్రధాని పదవిని చేపట్టాక తొలిసారిగా తుమకూరుకు వచ్చిన నరేంద్ర మోడీ బుధవారం ఇక్కడ సిద్ధ గంగ మఠాధిపతి శ్రీ శివ కుమార స్వామీజీ ఆశీర్వాదం పొందారు. బెంగళూరు నుంచి వచ్చిన ప్రధాని తుమకూరు విశ్వ విద్యాలయం ఆవరణలో నిర్మించిన హెలిప్యాడ్లో దిగారు. మేయర్ గీతా రుద్రేశ్ ఆయనకు స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి కారులో ఆయన గవర్నర్ వజూభాయ్ వాలాతో కలసి మఠానికి వెళ్లారు. స్వామీజీకి తాంబూలమిచ్చి పాదాలకు నమస్కరించారు.
స్వామీజీ ఆయనకు కొబ్బరి నీరు ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం ప్రధాని స్వామీజీతో కాసేపు సంభాషించారు. ఇదే సమయంలో జమ్ము, కాశ్మీర్ వరద బాధితులకు మఠం తరఫున స్వామీజీ రూ.25 లక్షల చెక్కును అందజేశారు.
అనంతరం ప్రధాని మఠం ఆవరణను తిలకించారు. అక్కడ చదువుకుంటున్న పిల్లలతో కరచాలనం చేశారు. పది నిముషాల పాటు వారితో ముచ్చటించారు. అంతకు ముందు మఠంలో ప్రధాని మాట్లాడుతూ... ఈ రోజు తనకెంతో పవిత్రమైనదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా మఠాన్ని సందర్శించానని తెలిపారు.
ప్రధానికి శివకుమార స్వామీజీ ఆశీర్వాదం
Published Thu, Sep 25 2014 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement