ప్రధానికి శివకుమార స్వామీజీ ఆశీర్వాదం | Sakshi
Sakshi News home page

ప్రధానికి శివకుమార స్వామీజీ ఆశీర్వాదం

Published Thu, Sep 25 2014 3:25 AM

Prime Shiva Kumar Swamiji blessed

తుమకూరు : ప్రధాని పదవిని చేపట్టాక తొలిసారిగా తుమకూరుకు వచ్చిన నరేంద్ర మోడీ బుధవారం ఇక్కడ సిద్ధ గంగ మఠాధిపతి శ్రీ శివ కుమార స్వామీజీ ఆశీర్వాదం పొందారు. బెంగళూరు నుంచి వచ్చిన ప్రధాని తుమకూరు విశ్వ విద్యాలయం ఆవరణలో నిర్మించిన హెలిప్యాడ్‌లో దిగారు. మేయర్ గీతా రుద్రేశ్ ఆయనకు స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి కారులో ఆయన గవర్నర్ వజూభాయ్ వాలాతో కలసి మఠానికి వెళ్లారు. స్వామీజీకి తాంబూలమిచ్చి పాదాలకు నమస్కరించారు.
 
స్వామీజీ ఆయనకు కొబ్బరి నీరు ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం ప్రధాని స్వామీజీతో కాసేపు సంభాషించారు. ఇదే సమయంలో జమ్ము, కాశ్మీర్ వరద బాధితులకు మఠం తరఫున స్వామీజీ రూ.25 లక్షల చెక్కును అందజేశారు.

అనంతరం ప్రధాని మఠం ఆవరణను తిలకించారు. అక్కడ చదువుకుంటున్న పిల్లలతో కరచాలనం చేశారు. పది నిముషాల పాటు వారితో ముచ్చటించారు. అంతకు ముందు మఠంలో ప్రధాని మాట్లాడుతూ... ఈ రోజు తనకెంతో పవిత్రమైనదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా మఠాన్ని సందర్శించానని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement