నాసిక్ రోడ్ కేంద్ర కారాగార అధికారుల యోచన
నాసిక్: నాసిక్ రోడ్ కారాగారంలోని ఖైదీలకు ధ్యానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం సంబంధిత ఉన్నతాధికారులు ఇగత్పురిలోని విపస్సన అంతర్జాతీయ అకాడమీ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఖైదీల ఆలోచనలు, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని సూపరింటెండెంట్ జయంత్నాయక్ తెలిపారు. ఈ కారాగారంలో మొత్తం 2,200 ఖైదీలు ఉన్నారు. వీరిలో 70 శాతంమంది జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా తమ కుటుంబసభ్యుల గురించి ఆలోచించడమే కాకుండా ఆందోళనకు కూడా గురవుతుంటారు. ఈ రకమైన ఒత్తిడి నుంచి బయటపడే యంతో, వారిలో సానుకూల శక్తిని పెంపొందించాలనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కారాగార ప్రాంగణంలో ఓ హాలును నిర్మిస్తామన్నారు. అయితే తమ ప్రతిపాదనకు సంబంధించి విపస్సన సంస్థనుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదన్నారు. ఒకేసారి 30 మంది ఖైదీలు ధ్యానంలో కూర్చునేందుకు వీలుగా సదరు హాలును నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇదే విషయమై విపస్సన కేంద్రం కోర్సు మేనేజర్ దిలీప్ దేశ్పాండే మాట్లాడుతూ 1990-94 మధ్యకాలంలో అనేకమంది ఖైదీలకు ధ్యానంపై శిక్షణ ఇప్పించామన్నారు. అయితే ఆ తరువాత కొంతమంది అధికారులు బదిలీ కావడం, పరిస్థితులు అనుకూలించకపోవడంతో కోర్సును నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంకూడా ఏదైనా జీఆర్ జారీ చేస్తే బాగుంటుందన్నారు. అలా అయితే మున్ముందు ఈ కోర్సు నిర్విఘ్నంగా కొనసాగేందుకు వీలవుతుందన్నారు.
లోక్సభ ఎన్నికలు ముగిసిపోయినందువల్ల జీఆర్ అంశాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఖైదీల్లో ఒత్తిడి విపరీతంగా ఉంటుందన్నారు. అందువల్ల వారికి ఇటువంటి కోర్సు అత్యంత అవసరమన్నారు. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల ఎన్నో సత్ఫలితాలు ఉంటాయన్నారు.
ఖైదీలకు ధ్యానం కోర్సు
Published Tue, May 20 2014 10:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement