Sakshi News home page

వేదికపై స్టాలిన్‌తో కమల్‌.. ప్రేక్షకుల్లో రజనీ

Published Thu, Aug 10 2017 7:20 PM

వేదికపై స్టాలిన్‌తో కమల్‌.. ప్రేక్షకుల్లో రజనీ

చెన్నై: తమిళనాడు అగ్రనటులు ఒకే చోట కనిపించారు. వారిలో ఒకరు రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయనున్నట్లు పరోక్షంగా ప్రకటనలు చేసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కాగా.. అన్నాడీఎంకేపై ఎప్పటికప్పుడు విమర్శల వర్షం కురిపిస్తున్న మరో తమిళ్‌ సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌. గురువారం చెన్నైలో డీఎంకే అధికారిక పత్రిక మురసోలి 75వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించింది. దీనికి హాజరయ్యేందుకు కమల్‌, రజినీలతోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపగా వీరిద్దరు కూడా హాజరై అభిమానులకు కనువిందు చేశారు.

అయితే, కార్యక్రమ నిర్వహణ వేదికపై స్టాలిన్‌ పక్కనే కమల్‌ హాసన్‌ కూర్చొని ఉండగా.. వేదిక కింద అభిమానుల మధ్య కూర్చొని రజనీ కనిపించారు. రెండు రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. మీడియా వర్గాల సమాచారం ప్రకారం కమల్‌ హాసన్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడతారని తెలిసింది. ఇటీవల ఏఐఏడీఎంకేకు వ్యతిరేకంగా స్వరం పెంచుతూ వస్తున్న కమల్‌ తమ కార్యక్రమానికి హాజరుకావడం డీఎంకే ముఖ్య విషయంగా భావిస్తోందట. కమల్‌ చేస్తున్న ఆరోపణలకు డీఎంకే కూడా మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement