సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నామ్ తమిళర్ కట్చి, తమిళర్ మున్నేట్ర పడై తదితర ఈలం తమిళాభిమాన సంఘాలు ఇచ్చిన పిలుపు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బుధవారం సత్యమూర్తి భవన్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. దీంతో ఆ పరిసరాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహాలపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ తమ ప్రతాపం చూపించారు. ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. రాజీవ్ విగ్రహాల ధ్వంసం: వేప్పెరి పోలీసు స్టేషన్ సమీపంలో, పెరంబూరు బ్యారెక్స్ రోడ్డు - పురసై వాక్కం మార్గంలో, పటాలంలోని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఒక చోట విగ్రహం ముఖాన్ని ధ్వంసం చేయగా, రెండు చోట్ల తలను తీసి పక్కన పెట్టేశారు. మరి కొన్ని చోట్ల విగ్రహాలను అవమానించే రీతిలో వ్యవహరించి వదిలి పెట్టారు. ఉదయాన్నే ఈ విగ్రహాలను చూసిన ఆయా ప్రాంతాల కాంగ్రెస్ నేతల్లో ఆక్రోశం రగిలింది. ఈ ధ్వంసం తమిళ సంఘాల పనేనంటూ ఆందోళనలకు దిగారు. రాయపురం, పెరంబూరు, పురసైబాక్కం, వలసరవాక్కంలలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. ఈ దాడులు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ అండ్ బృందం పనిగా పేర్కొంటూ, వారిని అరెస్టు చేయాలని పట్టుబట్టారు. రాస్తారోకోలతో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనకుండా ఆయా పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్తగా కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామని కాంగ్రెస్ నేత రాయపురం మనో పేర్కొన్నారు.
పెట్రో బాంబు దాడి: బుధవారం అర్ధరాత్రి నామ్ తమిళర్ కట్చి కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు పోరూర్లోని ఆ పార్టీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు. అదృష్ట వశాత్తు ఆ పెట్రోల్ బాంబు పేలలేదు. అక్కడి సిబ్బంది దానిని ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ బాంబు దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు. విగ్రహాల ధ్వంసాలపై కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి కార్యాలయానికి భద్రతను కల్పించారు. ఉదయాన్నే కొందరు కాంగ్రెస్ నాయకులు వలసరవాక్కంలోని సీమాన్ ఇంటిపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఏడుగురు అరెస్టు:సత్యమూర్తి భవన్వద్ద జరిగిన దాడిపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. ఆ కార్యాలయంపై దాడికి, కాంగ్రెస్ నాయకులపై హత్యాయత్నం చేశారంటూ ఏడుగుర్ని అరెస్టు చేశారు. వీరిలో తమిళర్ మున్నేట్ర పడైకు చెందిన వీర లక్ష్మి, దురై, పార్తీబన్, సురేష్, మదన్, వెంకటేష్, భరత్ ఉన్నారు.
ఆరనిజ్వాల
Published Fri, Feb 28 2014 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement