మద్దిలపాలెంలో దొంగల బీభత్సం | Sakshi
Sakshi News home page

మద్దిలపాలెంలో దొంగల బీభత్సం

Published Fri, Dec 23 2016 11:46 AM

robbers hulchul in visakhapatnam

విశాఖ: విశాఖపట్నం మద్దిల పాలెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉండే ఓ ఇంట్లోకి పోలీసుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో ఉన్న వాళ్లను కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేసి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఆ ఘటనలో 25 తులాల బంగారం, 50 వేల నగదును దుండగులు అపహరించుకు పోయారు. స్ధానికుల సహాయంతో బయటపడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement