రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం

Published Thu, May 18 2017 10:48 AM

రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం

చెన్నై: రద్దు అయిన పాత నోట్లను  భారీ మొత్తంలో  తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 45 కోట్ల  పాత క‌రెన్సీని పోలీసులు గురువారం ఉదయం ప‌ట్టుకున్నారు. చెన్నైలోని కోడంబ‌క్కంలో ఉన్న వ‌స్త్ర దుకాణం రామలింగం అండ్‌ కో లో ఈ మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ దుకాణంలో విస్తృత స్థాయిలో సోదాలు నిర‍్వహిస్తున్నారు.

 ఆ షాపు యజమాని దండపాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ జ్యూవెలరీ వ్యాపారికి సంబంధించిన సొమ్ము త‌న ద‌గ‍్గర ఉన‍్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే కానీ పోలీసులు మాత్రం పాత క‌రెన్సీపై ఆరా తీస్తున్నారు. అవినీతి, లంచాల వ‌ల్ల వ‌చ్చిన సొమ్ము అయి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement