సరాసరిన రోజుకో అత్యాచార కేసు నమోదు
మహిళలపై నానాటికీ పెరుగుతున్న అకృత్యాలు
భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం
హెల్ప్లైన్ నంబర్ 103 ప్రారంభిస్తామంటున్న పోలీసులు
సాక్షి, ముంబై: నగరంలో మహిళలకు రక్షణ లేకుం డా పోతోంది. ఇక్కడ రోజుకొక అత్యాచార కేసు నమోదవుతోందంటే పరిస్థితి ఎంత విషమంగా ఉం దో అర్ధం చేసుకోవచ్చు. మహిళా రక్షణకు పోలీసు లు తీసుకుంటున్న చర్యలతో ఎటువంటి ఫలితం కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2012తో పోల్చితే 2013లో మహిళలపై జరిగిన అత్యాచారాల కేసులు 71 శాతం వరకు పెరిగాయి. ఇటీవల నగర పోలీసులు మహిళలపై నమోదైన అత్యాచార కేసుల వివరాలను వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు మితిమీరిపోతున్నట్లు పోలీసు లు వెల్లడించిన నివేదిక ఆధారంగా స్పష్టం అవుతోంది.
ముంబై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 2013లో నగరంలో దాదాపు 394 అత్యాచార కేసులు నమోదవ్వగా, ఇందులో 241 మంది బాలికలు ఉన్నారు. 2012లో 231 అత్యాచార కేసు లు మాత్రమే నమోదయ్యాయి. ఇదిలా వుండగా 2014లో జనవరి ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వర కు 26 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో రోజుకు ఒక్కటైనా అత్యాచార కేసు నమోదవుతోందని స్పష్టం అవుతోంది. కాగా మహిళలపై వేధింపుల కేసులు 2012తో పోల్చితే 2013లో.. 97 శాతం పెరిగాయి. 2012లో మహిళలపై వేధింపు కేసులు 590 నమోద వ్వగా 2013లో 1,161 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మహిళలపై కిడ్నా ప్ కేసులు కూడా పెరిగాయని చెప్పవచ్చు. 2013లో మహిళల కిడ్నాప్ కేసులు 251 నమోదు కాగా, 2012లో ఆ కేసుల సంఖ్య 141 మాత్రమే. దీంతో మహిళలపై కిడ్నాప్ కేసులు 78 శాతం పెరిగాయని తెలుస్తోంది. ఇదిలా వుండగా చైన్ స్నాచింగ్ విషయానికి వస్తే 2012లో 727 కేసు లు నమోదు కాగా, 2013లో 2,078 నమోదయ్యాయి.
ఈ సందర్భంగా ముంబై కమిషనర్ ఆఫ్ పోలీ స్ రాకేష్ మారియా మాట్లాడుతూ.. మహిళల రక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడంలేదని చెప్పా రు. ఇక మీదట మహిళల భద్రత విషయమై పకడ్బందీగా వ్యవహరించనున్నామన్నారు. తరచూ కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నామన్నారు. ఇదిలా వుండగా హెల్ప్లైన్ నెంబర్ 103ను ఏర్పాటుచేసి హ్యాండిల్ చేసే సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. కాల్ అందుకున్న వెంటనే
సాధ్యమైనంత త్వరగా మహిళా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయనున్నామని తెలిపారు. అయితే ఒక వేళ ఆ సమయంలో మహిళా సిబ్బంది అందుబాటులో లేకపోతే సమీప ప్రాంతంలోని పోలీస్స్టేషన్లో ఉన్న సిబ్బందిని పంపించనున్నట్లు తెలి పారు. ఈ ప్రక్రియ వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తుందని మారియా తెలిపారు. అంతేకాకుండా మరో మూడురోజుల్లో రాత్రి వేళ్లలో రోజూ పెట్రోలింగ్ను నిర్వహించనున్నట్లు వివరించారు.
మహిళల రక్షణ..‘మిథ్య’!
Published Mon, Feb 24 2014 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement