మీడియాకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించిన సుప్రీం
తదుపరి ఉత్తర్వు జారీచేసే వరకు ముందుకెళ్లద్దని ఆదేశం
జులై 8న తదుపరి విచారణ
దీనిపై ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్ సర్కార్కు ఆదేశం
కేజ్రీవాల్ రెండు నాల్కల ధోరణిని కోర్టుకు తెలిపిన అమిత్ సిబల్
సాక్షి, న్యూఢిల్లీ: మీడియాను హద్దుల్లో పెట్టడానికి కేజ్రీవాల్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వు అమలుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీసే వార్తలు ప్రచురించే, ప్రసారం చేసే మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేజ్రీవాల్ సర్కారు ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ప్రఫుల్ల సి. సంపత్లతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్కు నోటీసు జారీ చేయాలని ఆదేశిస్తూ తాము తదుపరి ఉత్తర్వు ఇచ్చేవరకు మే6న ఢిల్లీ సర్కారు జారీ చేసిన సర్క్యులర్పై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది.
జులై 8న కేసుపై తదుపరి విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇన్ఫర్మేషన్ డెరైక్టరేట్ ఇలాంటి సర్క్యులర్ను ఎందుకు జారీ చేసిందో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరు వారాల్లో అంటే జులై 8 లోగా తెలపాలని ధర్మాసనం కేజ్రీవాల్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పరువు నష్టం దావాల విషయంలో కే జ్రీవాల్ అనుసరిస్తోన్న రెండు నాల్కల ధోరణిని సీనియర్ న్యాయవాది అమిత్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో సుప్రీం కోర్టు ఈ స్టే జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కుమారుడైన అమిత్ సిబల్ కేజ్రీవాల్ తదితరులపై గతంలో పటియాలా కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఈ దావా చట్టబద్ధతను సవాలుచేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పరువు నష్టం దావా విచారణపై సుప్రీం స్టే విధించింది.
అమిత్ సిబల్ గురువారం ఈ స్టేను ఎత్తివేయాలని కోరుతూ.. కేజ్రీవాల్ సర్కారు మీడియాకు పగ్గాలు వేయడానికి జారీ చేసిన సర్క్యులర్ను సుప్రీంకోరు ్ట దృష్టికి తె చ్చారు. కేజ్రీవాల్ ఓ పక్క పరువునష్టం దావా చట్టబద్ధతను సవాలుచేస్తూ, మరో పక్క మీడియాపై పరువు నష్టం దావా వేయాలని ఆదేశిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పరువునష్టం దావాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసి, మీడియాపై పరువునష్టం దావాకు ఉత్తర్వు జారీ చేయడం సబబు కాదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ అమలుపై స్టే విధించింది.
ప్రభుత్వానిది అప్రజాస్వామిక ఉత్తర్వు: కాంగ్రెస్, బీజేపీ
పత్రికలలో ప్రచురితమైన లేదా టీవీ చానెళ్లలో ప్రసారమైన వార్త ఏదైనా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారికి ఎవరికైనా అనిపిస్తే ఆ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని కేజ్రీవాల్ సర్కారు ఉత్తర్వులో పేర్కొంది.ప్రాసిక్యూషన్ డెరైక్టర్, ప్రభుత్వ న్యాయశాఖ అనుమతి లభించిన తరువాత ప్రభుత్వం పరువునష్టం కూడా దాఖలు చేయవచ్చని సర్క్యులర్ తెలిపింది. మీడియాకు పగ్గాలు వేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశంపై అనేక విమర్శలు వెలువడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ దీనిని నిరంకుశ, అప్రజాస్వామిక ఉత్తర్వుగా అభివర్ణించాయి.
ఈ ఆదేశం అమలుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించడం పట్ల డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాను పూర్తిగా ఉపయోగించుకున్నారని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని అప్పుడు వాదించి ఇప్పుడు దానిని అడ్డుకోడానికి ప్రయత్నించారని మాకెన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉత్తర్వు అమలుపై స్టే విధించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మీడియా ఆప్ గుట్టు బయటపెడుతుందని కేజ్రీవాల్ భయపడుతున్నారని, నైతికత గురించి మాట్లాడే ఆయన తన పార్టీలోని అవినీతిపరులైన నేతలపై చర్యలు చేపట్టడం లేదని ఉపాధ్యాయ ఆరోపించారు.
కేజ్రీవాల్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారు
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తల్ని ప్రసారం చేసే మీడియా సంస్థలపై పరువు నష్టం కేసు వేస్తామంటూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని బహిషృత ఆప్నేత ప్రశాంత్ భూషణ్ స్వాగతించారు. కేజ్రీవాల్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. కేజ్రీవాల్ ఒకవైపు తను ఎదుర్కొంటున్న పరువు నష్టం కేసు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ..మరోవైపు అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై ప్రభుత్వ ఖర్చులతో పరువు నష్టం కేసు వేస్తామని ఉత్తర్వులు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు గుర్తించిందన్నారు.
- బహిష్కృత ఆప్ నేత ప్రశాంత్ భూషణ్
కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ
Published Fri, May 15 2015 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement