♦ కారును ఢీకొన్న ఇసుక లారీ
♦ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం
♦ నలుగురికి తీవ్ర గాయాలు
వాళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వారు. ఆధ్యాత్మిక చింతనతో రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ఆలయాలు చుట్టి ఆనందపరవశులయ్యారు. ఆ తీపి గురుతులను నెమరు వేసుకుంటూ ఇంటిముఖం పట్టారు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం. విధి ఆడిన వింత నాటకంలో ఏడుగురు బలైపోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన శనివారం కరూర్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించింది. బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
సేలం : తమిళనాడులోని కరూర్ జిల్లాలో శనివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, మహిళ సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేరళ రాష్ట్రం కాసర్కోడు జిల్లా మందైకాప్పు ప్రాంతానికి చెందిన రోహిత్ మంజర(22), జరాల్డ్ మంజర(35), క్షత్రియన్ (30), ఆల్విన్ (40),
విహారం.. విషాదం
రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6), జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్ కారులో వేలాంకన్ని పర్యాటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి అదేకారులో తిరుగుపయనమయ్యారు. కారును రోహిత్ మంజర నడుపుతున్నాడు. శనివారం ఉదయం 6.30 గంటలకు కరూర్ జిల్లా కుళితలై సమీపంలోని కె.పేట్టై బైపాస్ రోడ్డులో కారు వెళ్తోంది. అదే సమయంలో కరూర్ నుంచి ఇసుక లోడుతో తిరుచ్చి వైపు లారీ వేగంగా వస్తోంది. అకస్మాత్తుగా కారు – లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కారులోనివారు శిథిలాల్లో చిక్కుకుపోయారు. కేకలు విని స్థానికులు వారిని వెలుపలికి తీశారు. సమాచారం అందుకున్న కుళితలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రమాదంలో రోహిత్ మంజర (22), జరాల్డ్ మంజర (35), క్షత్రియన్ (30), ఆల్విన్ (40), రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కారు టైర్లు పేలిన కారణంగా అదుపుతప్పి లారీని ఢీకొని ఉండవచ్చని చెబుతున్నారు. ప్రమాదం కారణంగా కరూర్ – తిరుచ్చి రోడ్డుపై రెండు గంటలకు పైగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కరూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Published Sun, May 14 2017 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement