Sakshi News home page

టీచర్‌ తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్య

Published Fri, Sep 1 2017 8:16 AM

టీచర్‌ తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

కేకేనగర్‌: టీచర్‌ మందలించిదని విరక్తి చెందిన విద్యార్థిని మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో పాఠశాల టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.  మూడు రోజుల అనంతరం బుధవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తిరునల్వేలి జిల్లా పాలయంకోట్టై కోట్టూరుకు చెందిన సయ్యద్‌ అహ్మద్‌ కుమార్తె హాజిరా (12) అదే ప్రాంతంలో 7వ తరగతి చదివింది. గత 28వ తేదీ సోమవారం ఉదయం హాజిరా మెద్దెపై నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

దీనిపై పాలయంకోట్టై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఆత్మహత్యకు ముందు హాజిరా రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రకారం టీచర్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా హజీరా తండ్రి తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక దాఖలు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement